Hyderabad : దారుణం…బాలికను కిడ్నాప్ చేసి రెండు రోజులపాటు అత్యాచారం..!!

హైదరాబాద్ లో దారుణం జరిగింది. నాంపల్లిలో 13 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి...అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు.

  • Written By:
  • Publish Date - September 15, 2022 / 11:13 AM IST

హైదరాబాద్ లో దారుణం జరిగింది. నాంపల్లిలో 13 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి…అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. చంచల్ గూడకు చెందిన బాలికను అదే ప్రాంతానికి చెందిన యువకులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి నాంపల్లిలోని ఓ లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ బాలికకు మత్తమందు ఇచ్చి అత్యాచారానికి ఒడిగట్టారు.

బాధితురాలిని లాడ్జీలోనే వదిలేసి అక్కడినుంచి పరారయ్యారు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులుకు బాదితురాలికి తెలిసినవారేనని పోలీసులు తెలిపారు. వారి మాయమాటలు నమ్మి వారి వెంట బాలిక వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు.