తన భర్తతో ఎఫైర్ ఉందని అనుమానిస్తూ, అసూయతో ఉన్న ఓ భార్య ఐదుగురు పురుషులతో యువతిపై దారుణంగా అత్యాచారం చేయించింది. అంతేకాదు.. రేప్ ద్రుశ్యాలను తన మోబైల్ ద్వారా రికార్డ్ చేసింది. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. కొండాపూర్లోని శ్రీరామ్నగర్ కాలనీలో గాయత్రి అనే మహిళా ఇంట్లో ఈ దారుణం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయత్రితో పాటు ఐదుగురు రేపిస్టులతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాయత్రి భర్త శ్రీకాంత్ సివిల్ కోచింగ్ సమయంలో ఓ యువతిని కలిశాడు. అయితే గాయత్రి తరుచుగా అనారోగ్యం పాలవుతుండడంతో ఆమెతో కలిసి ఉండాల్సిందిగా కోరాడు. దీంతో గాయత్రి అక్టోబరు 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు ఆమెతో పాటు ఉంది.
అయితే, శ్రీకాంత్, ఆ యువతి మధ్య సంబంధం ఉందని అనుమానించిన గాయత్రి ఆ అమ్మాయిపై రేప్ చేయించింది. బాధితురాలికి తీవ్ర గాయాలు కాగా, ఆమె కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆరుగురు నిందితులను గాయత్రి, ఉల్సాల మనోజ్ కుమార్ (22), సయ్యద్ మస్తాన్ (25), షేక్ ముజాహిద్ (25), షేక్ మౌలా అలీ (32), పృధ్వీ విష్ణు వర్ధన్ (22)లుగా గుర్తించారు.