KTR: ఐటీ, ఫార్మా, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానం: ‘మీట్‌ ది ప్రెస్‌’ లో కేటీఆర్

హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.

  • Written By:
  • Updated On - October 28, 2023 / 03:15 PM IST

KTR: హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై మంత్రి కేటీఆర్ మీడియా ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు చెప్పారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్న ఆరోపణలు సరికాదన్నారు. రుణాలు తెచ్చి ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టామని.. సాగునీటి రంగం, మిషన్‌ భగీరథకు వినియోగించామన్నారు. విద్యుత్‌ రంగంలో సంస్కరణలు, సంపద సృష్టించడం కోసం రుణాలు తీసుకువచ్చినట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా ఏడాదిలో 4.5 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగితే.. ఒక్క హైదరాబాద్‌ నుంచే 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని కేటీఆర్‌ వెల్లడించారు. దేశంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌ నుంచే ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2.2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టామని.. ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాల భర్తీ జరిగిందన్నారు. మరో 90వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందన్నారు. ఐటీ, ఫార్మా, ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నామని.. నీళ్లు, నిధులు, నియామకాలకు సంపూర్ణ న్యాయం చేసినట్లు వివరించారు. ప్రతీ జిల్లాకో వైద్య కళాశాల ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. గతంలో మైగ్రేషన్‌కు పర్యాయపదంగా పాలమూరు ఉంటే.. ఇప్పుడు ఇరిగేషన్‌కు పర్యాయపదంగా మార్చామన్నారు.

‘‘ఏపీలో ఎలాగూ కాంగ్రెస్‌ పార్టీ కుప్పకూలింది. తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్‌ ఆరాటం. కాంగ్రెస్‌కు ప్రజలు 55 ఏళ్లపాటు అవకాశం ఇచ్చారు. కేంద్రంలో భాజపాకు పదేళ్లు అవకాశం ఇచ్చారు. వారికి ఏళ్ల తరబడి అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేసిందేమీ లేదు. అభివృద్ధి ఆధారంగా మేము ఓట్లు అడుగుతున్నాం. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న భాజపా హామీ ఏమైంది? 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్నారు.. ఏమైంది? మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

Also Read: Rohit Sharma: అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ.. 47 పరుగులు చేస్తే చాలు..!