Site icon HashtagU Telugu

Enugula Rakesh Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా రాకేశ్ రెడ్డి

Enugula Rakesh Reddy Brs Ml

Enugula Rakesh Reddy Brs Ml

ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక (Warangal – Khammam – Nalgonda BY MLC Elections)కు గాను బిఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. 2023, న‌వంబ‌ర్ 4వ తేదీన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన ఏనుగుల‌ రాకేశ్ రెడ్డి (Enugula Rakesh Reddy) ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. 2021 లో ఇదే స్థానం నుండి బిఆర్ఎస్ (BRS) తరుపున పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) విజయం సాధించారు. ఎమ్మెల్సీ స్థానం 2027 మార్చి వరకు ఉన్నప్పటికీ పల్లా రాజేశ్వర్..గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తరుపున జనగాం ఎమ్మెల్యే గా నిల్చుని విజయం సాధించారు. ఆ తర్వాత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసారు. దీంతో ఈ స్థానానికి గాను ఎన్నికలు అనివార్యమయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే స్థానంలో గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన తీన్మార్ మల్లన్న..ఈసారి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈరోజు తన నామినేషన్ ను కూడా దాఖలు చేయడం జరిగింది. ఇక ఈ ఉప ఎన్నికకు సంబదించిన నోటిఫికేషన్ సైతం వెల్లడైన సంగతి తెలిసిందే. ఈరోజు (మే 03) నుంచి మే 9వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు. 10 నుంచి నామినేషన్లను పరిశీలిస్తారు. మే 13 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఇక ఈ గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ మే 27న జరగనుంది. మొత్తం 4,61,806 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Read Also : Teenmar Mallanna : తన ఆస్తినంతా ప్రభుత్వానికి రాసిచ్చిన తీన్మార్ మల్లన్న