Hyderabad: హైదరాబాద్లో వీధికుక్కల దాడిలో మరో ఆరేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన బహదూర్పురా పోలీస్స్టేషన్ పరిధిలోని నంది ముసలాయిగూడలో చోటుచేసుకుంది. దాడి తరువాత బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాలుడు హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.హైదరాబాద్లో ఇలాంటి దారుణ ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా గాంధీ ఆస్పత్రిలో కోమళ్ల మహేశ్వరి అనే 13 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటన తెలిసిందే. , పోచమ్మపల్లి ప్రభుత్వ మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న ఆమె మానోకొండూరు మండల కేంద్రంలోని ఇంటి బయట హోంవర్క్ చేస్తుండగా వీధికుక్కలు దాడి చేశాయి. దాదాపు 40 రోజుల పాటు చికిత్స తీసుకున్నప్పటికీ ఆమె గాయాల నుండి బయటపడలేదు. తెలంగాణలో గతంలో వీధికుక్కల దాడుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
https://twitter.com/i/status/1729058073292247163
Also Read: Ind vs Aus T20: రుతురాజ్ కు సారీ చెప్పిన యశస్వి జైస్వాల్