SBI Adopts: పులుల దత్తతకు ‘ఎస్ బీఐ’ ముందడుగు!

బ్యాకింగ్ సర్వీస్ అనగానే.. చాలామందికి మొదట ఎస్ బీఐ సేవలు గుర్తుకువస్తాయి. ఎస్ బీఐ సర్వీస్ లోనే కాకుండా సేవలోనూ ముందుడగు వేస్తోంది. సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ముందుకువెళ్తోంది.

  • Written By:
  • Publish Date - February 22, 2022 / 11:47 AM IST

బ్యాకింగ్ సర్వీస్ అనగానే.. చాలామందికి మొదట ఎస్ బీఐ సేవలు గుర్తుకువస్తాయి. ఎస్ బీఐ సర్వీస్ లోనే కాకుండా సేవలోనూ ముందుడగు వేస్తోంది. సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ముందుకువెళ్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (హైదరాబాద్ శాఖ సర్కిల్) నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఈ ఏడాదికిగాను 15 పులులను దత్తత తీసుకుంది. హైదరాబాద్ సర్కిల్‌లోని ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ ఝింగ్‌రాన్, తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆర్.శోభకు దత్తత ఖర్చుల కోసం నిమిత్తం రూ.15 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా కొత్తగా పునర్నిర్మించిన ‘ఏషియాటిక్ లయన్స్’ ఎన్‌క్లోజర్‌లో రెండు సింహాలను ప్రదర్శన కోసం ఉంచారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ లో 14  ఆసియా సింహాలు ఉన్నాయి.

వన్యప్రాణుల సంరక్షణలో ఎస్‌బీఐ కీలకపాత్ర పోషిస్తోందని, ఇందులో భాగంగా నెహ్రూ జూలాజికల్ పార్క్ లో 2011 నుంచి ప్రతి ఏటా 15 పులులను ఎస్‌బీఐ దత్తత తీసుకుంటోందని జింగ్రాన్ తెలిపారు. పులులు, జంతు ప్రదర్శనశాలల నిర్వహణ పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన, పరిశుభ్రతతో పాటు జంతువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులోనూ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పులులను దత్తత తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. పులులను పెంచుతున్న జూ యాజమాన్యాన్ని, తెలంగాణ అటవీ శాఖను ఆయన అభినందించారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ లో వరుసగా పదో ఏటాకుగానూ15 పులులను దత్తత తీసుకోవడం ద్వారా వన్యప్రాణుల సంరక్షణకు ముందుకొచ్చినందుకుగాను శోభా జింగ్రాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.