RS Praveen: తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ ఆ పార్టీ గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వములో పనిచేసే అవకాశం రావడం చాల ఆనందంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ‘‘ఈరోజు కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నా. తెలంగాణ వాదం, బహుజనవాదం రెండు ఒక్కటే. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారు.
నన్ను చాల మంది విమర్శిస్తున్నారు నేను ఎటువంటి ప్యాకేజ్ లకు లొంగే వాడిని కాదు. నేను ఏమి ఆశించి రాలేదు, ఆశించే వాడిని అయితే కాంగ్రెస్ పార్టీలోకే వెళ్ళేవాడిని. నాలో ఎటువంటి స్వార్థం లేదు , నా గుండెల్లో భహుజనవాదం ఉంటుంది’’ అని ఆర్ ఎస్ అన్నాడు.
‘‘సీఎం రేవంత్ రెడ్డి నన్ను సూతిమెత్తగా హెచ్చరిక చేస్తున్నారు. మీరు గేట్లు తెరిస్తే చేరుతున్న గొర్రెల మందలో ఒక్కన్ని కాలేను. సీఎం రేవంత్ రెడ్డి నాకు టీఎస్పీఎస్సీ ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే.. నేను తిరస్కరించాను.. ఎవరైనా ఎక్కడైనా పని చేసుకునే స్వేచ్చ ఉంది. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పుకోవాలని రేవంత్ రెడ్డి నన్ను హెచ్చరిస్తున్నారు. నాకు నా రాజకీయ నిర్ణయం తీసుకునే స్వేచ్చ లేదా.. నేనూ పాలమూరు బిడ్డనే ’’ అని ఆర్ ఎస్ అన్నారు.