Revanth Reddy : కేసీఆర్ ప్రభుత్వంలోని సలహాదారులను తొలగించిన రేవంత్ సర్కార్

తాజాగా కేసీఆర్ ప్రభుత్వంలో సలహాదారులను పనిచేసిన వారిని తొలగించారు. ఏడుగురు ప్రభుత్వ సలహాదారులను తొలగిస్తూ చీఫ్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు

Published By: HashtagU Telugu Desk
CM Revanth Reddy

Revanth Cm

తెలంగాణ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..గత ప్రభుత్వం పనిచేసిన అధికారులపై వేటు వేస్తున్నారు. ఇప్పటికే పలువుర్ని మార్చిన రేవంత్..తాజాగా కేసీఆర్ ప్రభుత్వంలో సలహాదారులను (Advisor from KCR government) పనిచేసిన వారిని తొలగించారు. ఏడుగురు ప్రభుత్వ సలహాదారులను తొలగిస్తూ చీఫ్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో సోమేశ్ కుమార్, శోభ, జీఆర్ రెడ్డి, చెన్నమనేని రమేశ్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్ ఉన్నారు. వీరి స్థానంలో కొత్త సలహాదారులను నియమించనున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ ను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

సీఎం రేవంత్‌ రెడ్డి కి కోదండరామ్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ దృష్ట్యా ప్రభుత్వ పాలనలో ఆయన సహకారం తీసుకోవాలన్న ఉద్దేశంతో రేవంత్‌ రెడ్డి ఉన్నట్లు సమాచారం. నిజానికి ఎన్నికలకు ముందు నుంచే కోదండరామ్‌తో రేవంత్‌ రెడ్డి పలుమార్లు కలుస్తూ వచ్చారు. కాంగ్రెస్‌తో టీజేఎస్‌ పొత్తు పెట్టుకునేలా చేశారు. తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ కోదండరామ్‌ ప్రకటించారు. అయినప్పటికీ ఇరు పార్టీల మధ్య మైత్రీ బంధం కొనసాగింది. కోదండరామ్‌ కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వచ్చారు. ఆ పార్టీ పెట్టిన అనేక రకాల నిర్బంధాలను ఎదుర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం నుంచి దూరం కావాలని ఆకాంక్షించారు. ఆయన అనుకున్నట్లే బిఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడం..రేవంత్ సీఎం అవ్వడం తో ఆయన సంతోషం వ్యక్తం చేసారు. ఇక ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుడిగా ఎన్నికైతే రాష్ట్రంలోని నిరుద్యోగులతో పాటు చాలామంది సంతోషం వ్యక్తం చేస్తారు.

Read Also : Chandrababu: గెలుపు గుర్రాలకే టికెట్లు: చంద్రబాబు

  Last Updated: 09 Dec 2023, 04:02 PM IST