Rajnath Singh : రేవంత్ ‘ముస్లిం’ వ్యాఖ్యలపై మండిపడ్డ రాజ్నాథ్ సింగ్

Rajnath Singh : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published By: HashtagU Telugu Desk
Rajnath Singh Cm Revanth

Rajnath Singh Cm Revanth

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల రేవంత్ మాట్లాడుతూ “కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలంటే కాంగ్రెస్” అని చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయ వ్యవస్థకు మచ్చపెట్టే విధంగా ఉన్నాయని రాజ్‌నాథ్ మండిపడ్డారు. “ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత తక్కువ స్థాయికి దిగజారడం విచారకరం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మతరాజకీయాలను ప్రోత్సహిస్తూ, సమాజంలో విభేదాలు రేకెత్తిస్తోంది” అని ఆయన విమర్శించారు.

Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఫలితం ఏంటో తెలిసే KCR ప్రచారం చేయలేదు – సీఎం రేవంత్

రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, రాజకీయ లాభాల కోసం మతాన్ని ఉపయోగించడం దేశ సమైక్యతకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ముస్లిం సోదరులను రెచ్చగొట్టి ఓట్లు సాధించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. “దేశ ప్రజలు ఇప్పుడు బాగా ఆలోచించాలి. ఇటువంటి వ్యాఖ్యలు సమాజంలో కలహాలు రేపే అవకాశం ఉంది. దేశ ఐక్యతను దెబ్బతీసే రాజకీయాల కంటే అభివృద్ధి రాజకీయాలు అవసరం” అని ఆయన హితవు పలికారు.

అలాగే, దేశంలో స్థిరత్వం, అభివృద్ధి, భద్రతను కాపాడగలిగేది NDA ప్రభుత్వమని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. “మేము ప్రతి మతాన్ని గౌరవిస్తాం. కానీ ఎవరి మతాన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించం. దేశం మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి మన దగ్గరే ఉంది” అని అన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై ప్రజలు సరిగా స్పందించి, నిజమైన అభివృద్ధిని కోరుకునే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

  Last Updated: 09 Nov 2025, 04:52 PM IST