ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) హైదరాబాద్ పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 8వ తేదీన ఆయన హైదరాబాద్ రానున్నారు. రూ. 11 వేల 355 కోట్ల విలువైన పనులకు ప్రధాని శ్రీకారం చుట్టబోతున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ఈ మీటింగ్ లో మోడీ స్పీచ్ పై ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ (Hyderabad) లో పర్యటించబోతున్న మోడీ షెడ్యూల్ ఇలా ఉంది.
మోడీ హైదరాబాద్ పర్యటన
11:30 గం. లకు బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు
11:45 ని. ల నుంచి 12:05 ని. ల వరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు
12:15 ని. ల నుంచి 1:20 ని. ల వరకు పరేడ్ గ్రౌండ్ ప్రోగ్రాం
12:50 ని. ల నుంచి 1:20 ని. ల వరకు అరగంటపాటు ప్రధాని మోడీ స్పీచ్
1.30 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణం
Also Read: KTR@UK: కేటీఆర్ కు యూకే ఆహ్వానం.. ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో స్పీచ్!