తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీతో సంవత్సరం పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలను(Prajapalana Victory Celebrations) ఘనంగా నిర్వహించబోతుంది. ఇప్పటికే ఈ మేరకు అన్నీ ఏర్పాట్లు చేయాలని పరిశ్రమల శాఖను ఆదేశించింది. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా డిసెంబరు 1 నుంచి 9 వరకు వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది.
డిసెంబరు 1 : విద్యాశాఖకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల రెండో దశకు శంకుస్థాపన చేస్తారు. సీఎం కప్ 2024 పోటీలను ప్రారంభిస్తారు. ఈ పోటీలు డిసెంబరు 1 నుంచి 8వ తేదీ వరకు జరగనున్నాయి.
డిసెంబరు 2 : 16 నర్సింగ్, 28 పారా మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తారు. అలాగే 213 కొత్త అంబులెన్స్లను ప్రారంభించనుండా 33 ట్రాన్స్జెండర్ క్లినిక్లను ప్రారంభిస్తారు. ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్ల పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు.
డిసెంబరు 3 : హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమంతో పాటు ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్ను ప్రారంభిస్తారు. రూ.150 కోట్లతో చేపట్టిన సుందరీకరణ పనులను ప్రారంభించనున్నారు.
డిసెంబరు 4 : వర్చువల్ సఫారీ, వృక్ష పరిచయం కేంద్రం ప్రారంభించనున్నారు. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సుమారు 9007 మందికి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం చేయనున్నారు.(అటవీ శాఖ కార్యక్రమాలు)
డిసెంబరు 5న మహిళాభివృద్ధి కార్యక్రమాలు :
స్వయం సహాయక గ్రూపుల్లో చర్చలు
ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం
మేడ్చల్, మల్లేపల్లి, నల్గొండలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభోత్సవం
ఘట్కేసర్లో బాలికల ఐటీఐ కాలేజీ ప్రారంభం
డిసెంబరు 6న విద్యుత్ రంగానికి సంబంధించిన కార్యక్రమాలు :
యాదాద్రి పవర్ ప్లాంట్లో విద్యుదుత్పత్తి ప్రారంభం
244 విద్యుత్ ఉపకేంద్రాల శంకుస్థాపన
డిసెంబరు 7న విపత్తు నివారణ :
స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం
మూడురోజుల పాటు తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు
పోలీస్ బ్యాండ్ ప్రదర్శన
డిసెంబరు 8న స్పోర్ట్స్ వర్సిటీ :
డిసెంబరు 8వ తేదీన 7 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల ప్రారంభం
ఏఐ సిటీకి భూమి పూజ
130 కొత్త మీ సేవల ప్రారంభం
యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన
డిసెంబరు 9 : లక్షల మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. ట్యాంక్బండ్ మీద ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. సాయంత్రం డ్రోన్ షో, ఫైర్ వర్క్స్, ఆర్ట్ గ్యాలరీ, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.
Read Also : Illegally Transport : కాకినాడ పోర్టులో పవన్ కల్యాణ్ తనిఖీలు