Revanth Reddy Secret Survey: గెలుపు అభ్యర్థులు పై పీసీసీ చీఫ్​ రేవంత్​ సర్వే.!

ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి సహా ఆ పార్టీ నేతలంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Revanth Reddy Secret Survey : అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎక్కడ మీటింగ్​ పెట్టినా, ఎక్కడికెళ్లినా ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి (Revanth Reddy) సహా ఆ పార్టీ నేతలంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అన్ని నియోజకవర్గాల్లో ఆశావహులు ఎక్కువ సంఖ్యలో పోటీలో ఉన్నారు. ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు. కొందరు నేతలు బహిరంగంగా ప్రకటనలూ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టికెట్​ ఎవరికివ్వాలనే దానిపై ఇప్పటికే రేవంత్​ కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. టికెట్​ ఆశిస్తున్న వారిపై అన్ని నియోజకవర్గాల్లో ఆయన సొంతంగా సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సునీల్​ కనుగోలు టీం.. కాంగ్రెస్​ కోసం పనిచేస్తున్నా, అభ్యర్థులపై రేవంత్ పర్సనల్​గా సర్వే చేయిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బలమైన అభ్యర్థుల గురించి ఆయన సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తున్నది.

Also Read:  Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్‌లోకి వలసలు.. బీజేపీ ఎమ్మెల్యే చేరిక..!