మదాపుర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు విచారణ ముమ్మరం చేశారు.డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ను మరోసారి షేక్ చేస్తోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఇప్పటికే పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. నవదీప్ పిటిషన్పై సానుకూలంగా స్పందించిన హైకోర్టు మంగళవారం వరకు అరెస్టు చేయరాదని ఆదేశించింది. అయితే ఈ కేసులో నవదీప్ను డ్రగ్స్ వాడే వ్యక్తిగా పోలీసులు అభివర్ణించారు. పోలీసుల దాడుల్లో పట్టుబడిన రామ్ చంద్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంలో.. నవదీప్ తనతో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని రామ్ చంద్ పేర్కొన్నాడు. దీంతో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నవదీప్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలో ఈ నెల 16న హైదరాబాద్లోని నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో నవదీప్ ఇంట్లో లేడని సమాచారం. ఈ రోజు మరోసాని నవదీప్ నివాసంలో నార్కోటిక్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ (మంగళవారం) నవదీప్కు సంబంధించి నార్కోటిక్ బ్యూరో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయనుంది. ఇటీవల మాదాపూర్లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఈ పార్టీపై దాడి చేసిన 13 మందిని నార్కోటిక్స్ బ్యూరో అరెస్టు చేసింది. ఈ కేసులో నారోటిక్స్ బ్యూరో అధికారులు నవదీప్ను కూడా అదుపులోకి తీసుకుని విచారించాలని యోచిస్తున్నారు.