KCR: కేసీఆర్ బస్సును ఆపి తమ గోడు వినిపించిన నల్లగొండ రైతులు

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 08:44 PM IST

KCR: కేసీఆర్ బస్సును ఆపి తమ గోడు వినిపించారు నల్గొండ మండలం ఆర్జాలబాయి రైతన్నలు. ఐకేపీ సెంటర్ కాంచి గన్నీ బ్యాగుల ప్రదర్శన చేశారు రైతులు. ఇరువై రోజులనుంచి కల్లాల్లో ఓడ్లుపోసుకొని కూసున్నామని ధాన్యం కొంటలేరని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేదని రైతు బతుకు అంతా ఆగమైందని కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు.  మీరున్నప్పుడు నది ఎండాకాలం కుడా నీళ్లు మతల్లు దునికేవని, మీరు ఉన్నప్పుడే అప్పుడే మంచిగుండే సార్.. మల్లా మీ పాలనే రావాల”ని నినాదాలు చేశారు. రైతు బంధు లేదనీ, 500 బోనస్ అన్నరు, అది బోగస్ అయిందని, మేము పండించి కల్లంల పోసిన ధాన్యాన్ని కొంటలేరని మొర పెట్టుకున్నారు.

ఇగ బోనస్ ఏమిస్తారు సార్””.. కాంగ్రెస్ పాలన అంత బోగస్ పాలన అయ్యింది.” అని గోడువెళ్లబోసుకున్న రైతన్నలు. “పోరాడి సాధించుకుందాం నీళ్లు కరెంటు మల్లా తెచ్చుకుందాం పోరాటానికి సిద్ధంగా ఉండండి” అని కేసీఆర్ పిలుపునిచ్చారు. అంతకుముందు అన్నెపర్తి దగ్గెర కేసీఆర్ ను ఆపి ఇదే తరహాలో తమ గోడు వెల్లబోసుకున్నారు రైతన్నలు.