Crypto Scam In Telangana : రూ.100 కోట్ల క్రిప్టో కరెన్సీ స్కాం.. కుర్రిమెల రమేశ్‌గౌడ్‌ ఏం చేశాడంటే ?

జీబీఆర్‌ కాయిన్‌‌లలో(Crypto Scam In Telangana) పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించాడు.

Published By: HashtagU Telugu Desk
Crypto Scam In Telangana Kurrimela Ramesh Goud Cryptocurrency Scam

Crypto Scam In Telangana : స్యామ్ బ్యాంక్‌మన్ ఫ్రైడ్(sam bankman-fried) అమెరికాలో భారీ క్రిప్టో కరెన్సీ స్కాం చేశాడు. అదే రీతిలో జరిగిన క్రిప్టో కరెన్సీ స్కాం ఒకటి తెలంగాణలో ఆలస్యంగా వెలుగుచూసింది. కుర్రిమెల రమేశ్‌గౌడ్‌ అనే వ్యక్తి ఈ కుంభకోణానికి పాల్పడ్డాడు. ‘జీబీఆర్‌ కాయిన్‌’ పేరిట ప్రజలకు కుచ్చుటోపీ పెట్టాడు.

Also Read :Cockfights Race : బరి.. హోరాహోరీ.. ఏపీలో ఒక్కరోజే రూ.330 కోట్ల కోడిపందేలు

కుర్రిమెల రమేశ్‌గౌడ్‌ చేసిన క్రిప్టో స్కాంపై ప్రస్తుతం తెలంగాణ సీఐడీ దర్యాప్తు చేస్తోంది.  ఇప్పటివరకు దర్యాప్తులో పలు కీలక వివరాలను సీఐడీ గుర్తించింది. అవేంటో చూద్దాం..

  • జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన రమేశ్‌గౌడ్‌ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు చేరుకున్నాడు.
  • రమేశ్‌గౌడ్‌ తొలుత ట్రావెల్స్, గంధం మొక్కల వ్యాపారం చేశాడు.
  • తదుపరిగా జీబీఆర్‌ కాయిన్‌ పేరిట క్రిప్టో కరెన్సీ స్కాంకు కుర్రిమెల రమేశ్‌గౌడ్‌ తెర తీశాడు.
  • జీబీఆర్‌ కాయిన్‌‌లలో(Crypto Scam In Telangana) పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించాడు.
  • ఈక్రమంలో సింగపూర్, దుబాయ్‌లలోనూ మీటింగ్‌లను ఏర్పాటు చేశాడు. ఆ సమావేశాలు కేంద్రంగా పెట్టుబడులు సేకరించాడు. వాటిని జీబీఆర్ కాయిన్‌లలో పెట్టుబడి పెడతానని నమ్మించాడు.
  • అయితే కుర్రిమెల రమేశ్‌గౌడ్‌ ఆ డబ్బులతో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టలేదు.
  • జీబీఆర్ కాయిన్ పేరిట ఒక నకిలీ వెబ్‌సైట్‌‌ను తయారు చేసి అందులో డబ్బులు పెట్టుబడిగా పెట్టినట్లు లెక్కలను క్రియేట్ చేశాడు. వాటినే తన పెట్టుబడిదారులకు చూపించాడు.
  • ఆ నకిలీ వెబ్‌సైటులోకి లాగిన్ అయ్యేందుకు ప్రతీ పెట్టుబడిదారుడికి ఒక యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను అందించాడు. వారు ఆ వెబ్‌సైటులోకి లాగిన్ కాగానే పెట్టుబడి వివరాలు, లాభాల వివరాలు కనిపించేలా ఏర్పాట్లు చేశాడు.
  • కొన్ని రోజుల పాటు ఆ వెబ్‌సైటులో కనిపించే పెట్టుబడుల నుంచి డబ్బులను ఉపసంహరించుకునే అవకాశాన్ని రమేశ్ గౌడ్ కల్పించాడు. తద్వారా తనపై నమ్మకాన్ని పెంచుకున్నాడు.
  • తన సంస్థలో చేరిన వారి ద్వారా మరికొంత మందిని చేర్పించుకున్నాడు. ఈవిధంగా ఛైన్ సిస్టమ్‌లో వ్యాపారం చేయడంపై మన దేశంలో బ్యాన్ ఉంది.
  • చివరకు రూ.100 కోట్ల దాకా పెట్టుబడులు జమ అయిన వెంటనే వ్యాపారం ఆపేశాడు.  వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయిందని బుకాయించాడు. పెట్టుబడి పెట్టిన వాళ్లను కలవడం ఆపేశాడు.
  • కరీంనగర్‌కు చెందిన మనోజ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుతో రమేశ్‌గౌడ్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Also Read :Elon Musk – TikTok : అమెరికాలో టిక్‌టాక్‌ ఎలాన్ మస్క్‌ చేతికి.. ఎందుకు ?

  Last Updated: 14 Jan 2025, 09:23 AM IST