KTR : రానున్న ఉపఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం: కేటీఆర్‌

By-elections: త్వరలోనే స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని ఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

Published By: HashtagU Telugu Desk
ktr-comments-on-by-elections

ktr-comments-on-by-elections

By-elections: మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య శుక్రవారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ..త్వరలోనే స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని.. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. నియోజకవర్గం పార్టీలో మరింత ఉత్సాహం నింపేలా సంస్థాగతంగా మరింత బలంగా తీర్చిదిద్దేలా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.

Read Also:YS Jagan : చంద్రబాబు అతి దుర్మార్గంగా లడ్డూ రాజకీయాలు చేస్తున్నారు : వైఎస్‌ జగన్‌

కాగా, బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల కేసులో ఇటీవలే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నెల రోజుల్లో ఈ విషయంలో చర్యలు మొదలు పెట్టాలని విచారణ స్టేటస్‌ రిపోర్టును తమకు నివేదించాలని స్పీకర్‌ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది. లేదంటే సుమోటోగా కేసు విచారిస్తామని తెలిపింది. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకటట్రావు, దానం నాగేందర్‌లపై బీఆర్‌ఎస్‌ పిటిషన్‌ వేసింది.

Read Also:TTD : తిరుమల లడ్డూ వ్యవహారంపై రామజన్మభూమి ప్రధాన పూజారి విచారం

  Last Updated: 20 Sep 2024, 04:52 PM IST