LS Polls: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు.. 40 మంది స్టార్ క్యాంపెయినర్లు, సోనియా, ఖర్గే తో సహా!

  • Written By:
  • Updated On - April 30, 2024 / 04:11 PM IST

LS Polls: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్లలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన 40 మంది పేర్ల జాబితాలో ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ఇంచార్జీ దీపా , కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వంటి పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి.

తెలంగాణకు చెందిన మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, డి.శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అనసూయ (సీతక్క), పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి శ్రీనివాస్ రావు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్ గర్హి (మహారాష్ట్ర), రేణుకాచౌదరి, అనిల్ కుమార్ యాదవ్ (తెలంగాణ), సీనియర్ నేతలు విజయశాంతి, మహ్మద్ అజారుద్దీన్, మధు యాష్కీగౌడ్, బి.మహేష్ కుమార్ గౌడ్, టి.జయప్రకాశ్ (జగ్గారెడ్డి), వి.హనుమంతరావు, కె.జానారెడ్డి, అలీ షబ్బీర్, ఎస్.ఎ.సంపత్ కుమార్, పి.సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎస్.రాములు నాయక్, వాకాటి శ్రీహరి ముదిరాజ్, అద్దంకి దయాకర్ కూడా ప్రచారకర్తల జాబితాలో ఉన్నారు.