CM KCR: ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ

పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అధికార పార్టీ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు

CM KCR: పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అధికార పార్టీ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్ ప్రధానిని కోరారు.సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ఈ బిల్లును అమలు చేయాలని కోరారు.సామాజికంగా, విద్యాపరంగా అణగారిన వర్గాలకు జరిగిన చారిత్రక తప్పిదాలను సరిదిద్దేందుకు సరైన నియ్రం తీసుకోవాలని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ జూన్ 14, 2014 న ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ మేరకే పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలలో 33% రిజర్వేషన్లు కల్పించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేసీఆర్ అన్నారు.

Also Read: AP : బాబు కోసం జైలుకు జైలర్..అర్థమైందా రాజా..!