ఢిల్లీ. లిక్కర్ స్కామ్ లో కవిత (Kavitha) విచారణ ముగిసింది. మరోసారి ఈ నెల 16 విచారణకు రావాలని కవితకు నోటీస్ లు ఇచ్చారు. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగియడంతో బీ ఆర్ ఎస్ క్యాడర్ కు ఉపశమనం తాత్కాలికంగా లభించింది. విచారణ ముగిసిన తరువాత ఢిల్లీ లోని తండ్రి కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన క్వశ్చన్ అవర్ రాత్రి 8 గంటల వరకూ జరిగింది. మొత్తం 9 గంటలపాటు కవితను ఈడీ అధికారులు విచారించారు. సాయంత్రం 5.30 గంటలకే విచారణ ముగియాల్సి ఉండగా, అనూహ్యంగా రాత్రి వరకు కొనసాగించారు. రూల్ ప్రకారం మహిళలను సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా, సమయం దాటినా కవితను ఈడీ బయటకు పంపలేదు. ఈడీ వైఖరితో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి. అయితే.. కవిత బయటికి రాగానే, బీఆర్ఎస్ శ్రేణులు హ్యాపీగా ఫీలయ్యి ఈలలు, కేకలు, నినాదాలతో హోరెత్తించాయి.
ఈడీ ఆఫీసు దగ్గర పోలీసులు హై అలర్ట్ ప్రకటించడం, మీడియాను, బీఆర్ఎస్ కేడర్ను ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో లేకుండా పోలీసులు దూరంగా పంపారు. దీంతో కవిత (Kavitha) బయటికి రాగానే అరెస్ట్ చేస్తారని ఢిల్లీలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కార్యాలయం దగ్గర వాతావరణాన్ని చూసిన బీఆర్ఎస్ కార్యకర్తలు, మంత్రులు ఒకింత టెన్షన్ పడ్డారు.
ఇవాళ జరిగిన విచారణ మొత్తంలో కవిత మొబైల్ ఫోన్లు ధ్వంసం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు, స్కామ్లో సౌత్ గ్రూప్ పాత్రపై విచారించారని సమాచారం. అంతేకాకుండా అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా కవితపై ప్రశ్నల వర్షం కురిపించారని తెలుస్తోంది. మాజీ ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ఆధారంగా కూడా ప్రశ్నలు అడిగారని సమాచారం. కవిత-పిళ్లై ఇద్దర్నీ కాన్ఫ్రాంటేషన్ ఇంటరాగేషన్ ద్వారా అధికారులు విచారించారట. కవితతో పాటు మొత్తం 9 మందిని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మనీష్ సిసోడియా, కవిత, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, దినేష్ అరోరా, బుచ్చిబాబు, సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్, ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్లను విడివిడిగా, కలిపి ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మళ్లీ 16న ఏమి జరుగుతుంది? అనేది చూడాలి.
జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో పీఎంఎల్ఏ50(2) ప్రకారం అనుమానితురాలిగా ఈడీ అధికారులు కవిత స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నట్టు సమచారం. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, విజయ్ నాయర్, మనీష్ సిసోదియా స్టేట్మెంట్ల ఆధారంగా ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. అరుణ్ పిళ్లైతో కలిపి కవితను విచారిస్తున్నట్టు సమాచారం. ఆధారాలు ధ్వంసం చేయడం, డిజిటల్ ఆధారాలు లభించకుండా చేశారని, హైదరాబాద్లో జరిగిన సమావేశాలపై ప్రధానంగా ఈడీ ఆరా తీసినట్టు తెలుస్తోంది. కేజ్రీవాల్, సిసోదియాతో జరిగిన భేటీలపై కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
కవిత ఈడీ విచారణ గంటల తరబడి కొనసాగడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. భారాస శ్రేణులు ఈడీ కార్యాలయానికి చేరుకోకుండా దిల్లీ పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్ తదితరులు దిల్లీలోనే ఉన్నారు.
Also Read: Pokémon Pheromosa: కొత్త బొద్దింక జాతి గుర్తింపు.. “పోకీమాన్ ఫెరోమోసా” గా నామకరణం