Amit Shah : తెలంగాణ ప్రజలు ఏం కోరకుంటున్నారో నాకు తెలుసు…భారీ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం..!!

  • Written By:
  • Updated On - November 26, 2022 / 11:22 AM IST

తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో నాకు తెలుసు…రాబోయేది బీజేపీ ప్రభుత్వమే….భారీ మెజార్టీతో తెలంగాణ ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకువస్తారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఓ ఇంగ్లీష్ ఛానెల్ సమ్మిట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ సాధించడం ఖామన్నారు. తెలంగాణ ప్రజల పల్స్ నాకు బాగా తెలుసుఅన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో దేశంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కాగా తెలంగాణపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే అధికార పార్టీకి తగ్గట్లుగా వ్యూహాలకు ప్రతివ్యూహాలను రచిస్తోంది. తెలంగాణలో బీజేపీ నాయకులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ వారిని ఉత్తేజపరుస్తోంది. తెలంగాణ బీజేపీ విజయమే ఏకైక లక్ష్యంగా పావులు కదుపుతోంది. పార్టీలో బలమైన నాయకులను చేర్చుకోవడంతోపాటు క్యాడర్ లో మరింత ఉత్సహం వచ్చేలా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే పల్లెల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్న యూత్ మరింతగా తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర పేరుతో ఊరు ఊరునా తిరుగుతూ…బీజేపీని చొచ్చుకుపోయేలా చేస్తున్నారు.

బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య రాజకీయం తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ నాయకులపై ఐటీ దాడులు జరుగుతుండటంతో కేంద్రంలోఉన్న బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బీజేపీ ఈ దాడులను ప్రోత్సహిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.