హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్లు,ఫ్లాట్ల ధరలు

Hyderabad  కొవిడ్ తర్వాత 2023-24లో రియల్ ఎస్టేట్ మార్కెట్ గరిష్ఠ స్థాయికి చేరగా.. మళ్లీ కొంత కాలంగా ఫ్లాట్‌గానే ఉందని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలోనే గతేడాది ఇళ్లు లేదా ఫ్లాట్స్ ధరలు ఓ మోస్తరుగానే పెరిగాయి. ఈ మేరకు ప్రాప్‌టైగర్ ఒక రిపోర్ట్ వెలువరించగా దేశంలోని ఏ నగరంలో ధరలు ఏ స్థాయిలో పెరిగాయో మనం ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో ఇళ్లు/ఫ్లాట్స్ ధరలు 2025 సంవత్సరంల మోస్తరుగా పెరిగాయి. 2024తో […]

Published By: HashtagU Telugu Desk
Hyderabad Land Rent

Hyderabad Land Rent

Hyderabad  కొవిడ్ తర్వాత 2023-24లో రియల్ ఎస్టేట్ మార్కెట్ గరిష్ఠ స్థాయికి చేరగా.. మళ్లీ కొంత కాలంగా ఫ్లాట్‌గానే ఉందని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలోనే గతేడాది ఇళ్లు లేదా ఫ్లాట్స్ ధరలు ఓ మోస్తరుగానే పెరిగాయి. ఈ మేరకు ప్రాప్‌టైగర్ ఒక రిపోర్ట్ వెలువరించగా దేశంలోని ఏ నగరంలో ధరలు ఏ స్థాయిలో పెరిగాయో మనం ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో ఇళ్లు/ఫ్లాట్స్ ధరలు 2025 సంవత్సరంల మోస్తరుగా పెరిగాయి. 2024తో పోలిస్తే 2025లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు సగటున వార్షిక ప్రాతిపదికన 6 శాతం వరకు పెరిగాయి. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్‌టైగర్ ఒక నివేదిక విడుదల చేసింది. అయితే అంతకుముందు 2024లో మాత్రం ఏకంగా 17 శాతం వరకు పెరిగాయి. 2024తో పోలిస్తే 2025లో ఇళ్ల ధరలు అంతలా పెరగలేదన్నమాట. మరి ఏయే నగరాల్లో ధరలు ఏ స్థాయిలో పెరిగాయి.. ప్రాప్ టైగర్ ప్రకారం చదరపు అడుగుకు ఎక్కడ ధర ఎంత పలుకుతుందనేది తెలుసుకుందాం.

దేశ రాజధాని నగరం ఢిల్లీ- NCR ప్రాంతంలో ఇళ్ల ధరలు సగటున 6 శాతం పెరిగినట్లు ప్రాప్‌టైగర్ తెలిపింది. అంతకుముందు సంవత్సరంలో ఏకంగా 49 శాతం పెరగడం గమనార్హం. ఒక్కసారిగా రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు డిమాండ్ తగ్గడమే కారణంగా తెలుస్తోంది. అత్యధికంగా బెంగళూరులో ఇళ్ల ధరలు పెరగ్గా.. చెన్నైలో మాత్రం స్థిరంగా ఉన్నాయి.

దేశంలోని ఇతర నగరాల్లో చూస్తే హైదరాబాద్ నగరంలో సగటున ఇళ్ల ధరలు 8 శాతం పెరగ్గా చదరపు అడుగుకు 2025లో రూ. 7,644 కు చేరింది. అంతకుముందు 2024లో చదరపు అడుగు ధర రూ. 7053 గానే ఉంది. అహ్మదాబాద్‌లో ఇళ్లు లేదా ఫ్లాట్ల ధర సగటున 8 శాతం పెరిగి చదరపు అడుగుకు 4,754 కు చేరింది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో (MMR) 4 శాతం మేర ధరలు పెరిగి చదరపు అడుగుకు రూ. 13,164 వద్ద ఉంది.

ఢిల్లీ- NCR ప్రాంతంలో అంతకుముందు 2024లో చదరపు అడుగు ధర రూ. 8,105 గా ఉండగా.. ఇది 2025లో రూ. 8,570 కు ఎగబాకింది. ఇక్కడ 2022-24 మధ్య ధరలు విపరీతంగా పెరగడంతో.. ఇప్పుడు డిమాండ్ తగ్గగా ధరలు అంతలా పెరగలేదని రిపోర్ట్ పేర్కొంది. కోల్‌కతాలో కూడా ఇళ్ల ధరలు సగటున 6 శాతం పెరిగి చదరపు అడుగుకు ప్రస్తుతం రూ. 5,945 గా ఉంది. బెంగళూరు నగరంలో 13 శాతం మేర ఇళ్ల ధరలు పెరగ్గా.. చదరపు అడుగుకు రూ. 7,536 నుంచి రూ. 8,533 కు పెరిగింది. ఇక చెన్నై నగరంలో చదరపు అడుగు ధర రూ. 7,200 గా ఉండగా.. ఇది దాదాపు 2024 ధరలతో సమానంగానే ఉందని తెలుస్తోంది. అయితే టెక్ హబ్స్, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ల ఏర్పాటుతో మౌలిక సదుపాయాల కల్పన మెరుగ్గా ఉన్న నగరాల్లో ఇళ్లకు డిమాండ్ ఉంటుందని.. ధరలు కూడా పెరుగుతాయని రిపోర్ట్ అంచనా వేస్తోంది.

 

  Last Updated: 16 Feb 2026, 10:32 AM IST