బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. సోమవారం సుషీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్లో తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్లోని కోమటిరెడ్డి కార్యాలయంలో ఉదయం 11:30 గంటలకు సోదాలు ప్రారంభమైనట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుషీ ఇన్ఫ్రా సంస్థ ఉపఎన్నికలు జరిగిన మునుగోడు నియోజకవర్గంలోని వ్యక్తులు, వ్యాపార సంస్థల బ్యాంకు ఖాతాలకు 5.22 కోట్ల రూపాయలను బదిలీ చేసిందని ఇటీవల అధికార పార్టీ టీఆర్ఎస్ ఆరోపించింది.
Komatireddy Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డి కంపెనీలో ‘జీఎస్టీ’ రైడ్స్!

Komatireddy Rajagopal Reddy Fires On Revanth Reddy 1280x720