Komatireddy Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డి కంపెనీలో ‘జీఎస్టీ’ రైడ్స్!

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. సోమవారం సుషీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్‌లో తెలంగాణ రాష్ట్ర

  • Written By:
  • Updated On - November 14, 2022 / 05:55 PM IST

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. సోమవారం సుషీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్‌లో తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని కోమటిరెడ్డి కార్యాలయంలో ఉదయం 11:30 గంటలకు సోదాలు ప్రారంభమైనట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుషీ ఇన్‌ఫ్రా సంస్థ ఉపఎన్నికలు జరిగిన మునుగోడు నియోజకవర్గంలోని వ్యక్తులు, వ్యాపార సంస్థల బ్యాంకు ఖాతాలకు 5.22 కోట్ల రూపాయలను బదిలీ చేసిందని ఇటీవల అధికార పార్టీ టీఆర్‌ఎస్ ఆరోపించింది.