LRS : లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం పురపాలక శాఖ ఇటీవల సవరణ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం, జీహెచ్ఎంసీ (GHMC) దరఖాస్తుల పరిశీలనను మరింత కఠినంగా చేస్తూ, 1,06,920 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించింది. వీటిలో 40,000 దరఖాస్తులు ఇప్పటి వరకు పరిశీలించగా, 3,000 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి.
తాజా సమాచార ప్రకారం, 28,000 మంది దరఖాస్తుదారులకు మరిన్ని ధ్రువపత్రాలు సమర్పించాలని, మరియు కొంతమందికి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉందని సందేశాలు పంపించారు. దీని ద్వారా రూ.450 కోట్ల నుండి రూ.500 కోట్ల మధ్య ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో, ఈ ఆదాయం రాష్ట్రానికి పెద్ద ఉపశమనంగా నిలిచే అవకాశం ఉంది.
Govt Banks : ఐదు గవర్నమెంటు బ్యాంకుల్లో వాటాల అమ్మకం.. కీలక అప్డేట్
సవరణ మార్గదర్శకాల ప్రకారం, చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాల పక్కన ఉన్న లే అవుట్/ప్లాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు. సర్వే నంబర్ల ఆధారంగా, ఈ ప్రాంతాల వివరాలు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కు పంపిస్తారు. అక్కడి నుంచి ఇరిగేషన్, రెవెన్యూ విభాగాలకు ఆ వివరాలు వెళ్ళిపోతాయి. ఈ విభాగాల అధికారుల సిఫారసులపై, మునిసిపల్/పంచాయతీరాజ్ విభాగాలు దరఖాస్తులను ప్రాసెస్ చేస్తాయి.
ఈ ప్రక్రియ ద్వారా, ఫీజు చెల్లించాల్సిన లే అవుట్/ప్లాట్ దరఖాస్తుదారులకు ఆటోమేటిక్గా సందేశాలు పంపబడతాయి. మార్చి 31వ తేదీలోపు 25 శాతం రాయితీతో రుసుము చెల్లించే అవకాశం ఉంటుందని సమాచారం. క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత, క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫైనల్ ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. తిరస్కరించిన దరఖాస్తులలో చెల్లించిన రుసుములో 10% మినహాయించి మిగతా మొత్తాన్ని దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతాలో తిరిగి జమ చేస్తారు.
జోన్ల వారీగా దరఖాస్తుల వివరాలు:
ఎల్బీనగర్: 39,234
చార్మినార్: 15,283
ఖైరతాబాద్: 5,725
సికింద్రాబాద్: 5,694
శేరిలింగంపల్లి: 18,622
కూకట్పల్లి: 22,362
మొత్తం: 1,06,920
BJP Vs Shinde: ‘‘తేలిగ్గా తీసుకోవద్దు’’ అంటున్న షిండే.. ‘మహా’ సంచలనం తప్పదా ?