Kazipet Railway Route : సికింద్రాబాద్‌- కాజీపేట రైల్వే మార్గం.. గుడ్ న్యూస్

సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ, చండీగఢ్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, లక్నో సహా ఉత్తరాది రాష్ట్రాలకు కాజీపేట(Kazipet Railway Route) మీదుగానే రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

Published By: HashtagU Telugu Desk
Secunderabad To Kazipet Railway Route Four Railway Lines Ghatkesar To Kazipet

Kazipet Railway Route : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్. ప్రస్తుతం ఘట్‌కేసర్‌ నుంచి కాజీపేట వరకు 110.46 కి.మీ మేర రూట్‌లో రెండు రైల్వే లైన్‌లే ఉన్నాయి. త్వరలోనే ఈ రెండు రైల్వే లైన్లను నాలుగుకు విస్తరించనున్నారు. అదనంగా రెండు రైల్వే లైన్ల నిర్మాణానికి సంబంధించిన సర్వే పూర్తయింది. దక్షిణ మధ్య రైల్వే దీనికి సంబంధించిన వివరాలతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను  తయారు చేసి ఇటీవలే రైల్వేబోర్డుకు పంపింది. ఈ అదనపు రైల్వే లైన్ల నిర్మాణానికి రూ.2,837 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదనకు రైల్వే  బోర్డు నుంచి ఆమోదం లభిస్తే, రైల్వే శాఖ నుంచి ఈ ప్రాజెక్టుకు మంజూరు లభిస్తుంది. మంజూరు తేదీ నుంచి నాలుగేళ్లలోగా ఘట్‌కేసర్‌ టు కాజీపేట రూట్‌లో అదనంగా రెండు రైల్వే లైన్లను నిర్మిస్తారు. అంటే దాదాపు 2030 సంవత్సరం నాటికి ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read :Maoist Top Leaders: ఏపీ – తెలంగాణ బార్డర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ?

ఘట్‌కేసర్‌ టు కాజీపేట రూట్ వస్తే.. ఏమవుతుంది ?  

  • దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సికింద్రాబాద్.
  • సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ, చండీగఢ్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, లక్నో సహా ఉత్తరాది రాష్ట్రాలకు కాజీపేట(Kazipet Railway Route) మీదుగానే రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
  • సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నం, కోల్‌కతాల వైపు వెళ్లే రైళ్లకు కూడా కాజీపేటనే ప్రధానమార్గం.
  • ప్యాసింజర్ రైళ్లు, గూడ్సు రైళ్ల రాకపోకలతో సికింద్రాబాద్ – కాజీపేట రైల్వే రూట్ నిత్యం కిటకిటలాడుతుంటుంది.
  • ఈ రూట్ నుంచే దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు ఏటా భారీ ఆదాయం సమకూరుతోంది.
  • సెక్షన్‌ ట్రాక్‌ కెపాసిటీ వినియోగం 100 శాతంలోపు మాత్రమే ఉండాలని రైల్వే రూల్స్  చెబుతున్నాయి. అయితే ఇది సికింద్రాబాద్ – కాజీపేట రూట్‌లో 128 శాతంగా ఉంది.
  • కొత్తగా రెండు రైల్వే లైన్లను నిర్మించిన తర్వాతే..  ‘సెక్షన్‌ ట్రాక్‌ కెపాసిటీ వినియోగం’తో  ముడిపడిన సమస్య పరిష్కారం అవుతుంది.
  • ఈ మార్గంలో రైళ్ల హాల్టింగ్‌లు తగ్గుతాయి.
  • సికింద్రాబాద్ – కాజీపేట రూట్‌లో సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకల కోసం రెండు ప్రత్యేక లైన్లను కేటాయిస్తారు. తద్వారా వాటిలోని ప్రయాణికులు వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం కలుగుతుంది.
  • ఈ రూట్‌లో గూడ్సు బండ్లకు ప్రత్యేక మార్గం అందుబాటులోకి వస్తుంది.
  • ఇక ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి వరకు యాదాద్రి ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు కోసం మూడో రైల్వే లైను ఇప్పటికే మంజూరైంది.
  • ఘట్‌కేసర్‌-రాయగిరి వరకు నాలుగో లైను, రాయగిరి నుంచి కాజీపేట వరకు 3, 4 లైన్లను నిర్మించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదించారు.

Also Read :Operation Sandwich: పాకిస్తాన్‌ ముట్టడికి భారత్ బిగ్ ‘శాండ్‌విచ్’ స్కెచ్!

  Last Updated: 30 Apr 2025, 10:47 AM IST