Formula E-Race Case : తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసు(Formula e-Car Race Scam) చుట్టూ రాజకీయ, విచారణ వాతావరణం ఉద్ధృతమవుతోంది. ఈ కేసు సంబంధించి ఇటీవల ఏసీబీ (ఆంటీ కరప్షన్ బ్యూరో) , ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) దర్యాప్తు తీవ్రతను పెంచడంతో ఈ వ్యవహారంపై మరింత స్పష్టత రాబోతుందని భావిస్తున్నారు.
అరవింద్ కుమార్ విచారణకు హాజరు
ఈ కేసు విచారణలో కీలక మలుపుగా, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నేడు ఏసీబీ ముందు హాజరవుతారు. ఏసీబీ అధికారులు ఆయనను ప్రశ్నించి, ఈ కేసు నేపథ్యంలో కీలక సమాచారాన్ని రాబట్టనున్నారు. విచారణ తర్వాత ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు.
Assam Coal Mine: తొమ్మిది మంది బొగ్గుగని కార్మికులు బతికేనా ? 2 రోజులుగా 100 అడుగుల లోతున !
బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ విచారణ
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఆయన ఈడీ ముందు విచారణకు హాజరవుతారు. ఆయన స్టేట్మెంట్ తీసుకునేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు.
కేటీఆర్పై దర్యాప్తు వేగం
ఈ కేసులో ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పేరును కూడా లేవనెత్తడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. కేటీఆర్ రేపు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. అదేవిధంగా, ఈ నెల 16న ఈడీ ముందు హాజరవుతారని సమాచారం. ఫార్ములా ఈ-కారు రేసు కేసు క్వాష్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కేటీఆర్కు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోవడంతో, కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు సుప్రీంకోర్టు విచారణకు రావడం వల్ల దాని మీద తీసుకునే నిర్ణయం రాజకీయంగా కీలకమవుతుందని భావిస్తున్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలు
ఈ కేసును తనపై కక్ష సాధింపుగా చూసే ప్రయత్నమని కేటీఆర్ ఆరోపించారు. “న్యాయ వ్యవస్థపై నాకు గౌరవం ఉంది. చివరికి సత్యం గెలుస్తుంది. నా రాజ్యాంగబద్ధ హక్కులను నేను వినియోగించుకుంటాను” అని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే ఈ రోజుల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. న్యాయవాదుల సమక్షంలో విచారణకు అనుమతించేలా ఏసీబీ, ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరుతామని కేటీఆర్ వెల్లడించారు.
Venkatesh : వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం బిజినెస్ లెక్కలివే..!