Relationship: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. మహిళ దారుణ హత్య!

  • Written By:
  • Updated On - April 8, 2024 / 11:29 PM IST

Relationship: వివాహేతర సంబంధాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. దీని వల్ల పిల్లలు, కుటుంబ సంబంధాలు నాశనం అవుతాయి. ఈ అక్రమ సంబంధానికి మరో వివాహిత బాధితురాలు అయింది. అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంచలన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం, వట్టెం పరిధిలోని కల్వకుంట తండాకు చెందిన గిరిజన మహిళ చిట్టెమ్మ (28) తన భర్తకు విడాకులు ఇచ్చింది.

ఆ తర్వాత బిజినేపల్లికి చెందిన శివ అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. నిన్న శివ వట్టెం గ్రామంలోని పొలానికి రావాలని చిట్టెమ్మను పిలిచి ఆదివారం రాత్రి అక్కడే గడిపాడు. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో చిట్టెమ్మ మృతి చెందింది. ఊహించని ఈ పరిణామానికి భయపడిన శివ అక్కడ పడి ఉన్న చెత్తలో ఆమె మృతదేహాన్ని కప్పి స్థానిక బిజినేపల్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఎస్ఐ నాగ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివాహేతర సంబంధాలు పలువురి జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఊహించని పరిణామాలకు, దారుణాలకు కారణమవుతున్నాయి. పెళ్లై.. అనుకూలమైన భాగస్వామిని పొందినా సరే.. పక్క చూపులు చూసే వాళ్లు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఇక సమాజంలో చోటు చేసుకునే చాలా నేరాలకు వివాహేతర సంబంధాలే కారణం. పెళ్లై, పిల్లలున్నా సరే.. పరాయి వ్యక్తి మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. దీని వల్ల వారి జీవితాలు నాశనం కావడం మాత్రమే కాక.. అభంశుభం తెలియని చిన్నారుల జీవితాలు కూడా బలవుతున్నాయి.