Telangana: బీఆర్ఎస్ ఓటమి ఎఫెక్ట్, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్ల రాజీనామా!

  • Written By:
  • Updated On - December 4, 2023 / 04:52 PM IST

Telangana: ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే. దాదాపు ఆరుగురు మంత్రులు ఓటమి పాలయ్యారంటే పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు రాజీనామాలు చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. తెలంగాణ పునర్నిర్మాణం లో మాకు అవకాశం కల్పించిన కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి బీ ఆర్ ఎస్ అధ్యక్షులు కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల కనుగుణంగా పని చేస్తామని అన్నారు.

రాజీనామా చేసింది వీళ్లే

1. సోమ భరత్ కుమార్
చైర్మన్, రాష్ట్ర డెయిరీ డేవలప్మెంట్ కార్పొరేషన్
2. జూలూరి గౌరీ శంకర్
చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ
3. పల్లె రవి కుమార్ గౌడ్
చైర్మన్, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్
4. డాక్టర్ ఆంజనేయ గౌడ్
చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ
5. మేడె రాజీవ్ సాగర్
చైర్మన్, TS Foods Corporation
6. డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్
చైర్మన్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ
7. గూడూరు ప్రవీణ్
చైర్మన్, టైక్స్టైల్స్ కార్పొరేషన్
8. గజ్జెల నగేష్
చైర్మన్, బేవరేజెస్ కార్పొరేషన్
9. అనిల్ కూర్మాచలం
చైర్మన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్
10.రామచంద్ర నాయక్
చైర్మన్, ట్రైకార్
11. వలియా నాయక్
చైర్మన్, గిరిజన ఆర్థిక సహకార సంస్థ
12. వై సతీష్ రెడ్డి
చైర్మన్,
13. డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్
చైర్మన్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ
14. రవీందర్ సింగ్
చైర్మన్, పౌర సరఫరాల సంస్థ
15. జగన్మోహన్ రావు
చైర్మన్, రాష్ట్ర టెక్నాలజికల్ సర్వీసెస్