Drug Party : డ్రగ్స్ సప్లై, సేల్స్పై ఉక్కుపాదం మోపుతున్నామని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రభావం మాత్రం కనిపించడం లేదు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న రాడిసన్ హోటల్లో మూడు రోజులుగా డ్రగ్స్తో పార్టీ చేసుకుంటున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు ఉన్నారు. 2009 సంవత్సరంలో శేరిలింగంపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గజ్జల యోగానంద్ కుమారుడు గజ్జల వివేకానంద రాడిసన్ హోటల్లో డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డాడు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు యువకులను పోలీసులు విచారిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఈ పార్టీలో డ్రగ్స్, మద్యం ఏరులై పారినట్టు తెలుస్తోంది. పార్టీలో యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ (Drug Party) తీసుకున్నారు. దీనిపై పక్కా సమాచారం అందడంతో రాడిసన్ హోటల్పై దాడి చేసిన పోలీసులు, డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడిన వీరిని విచారిస్తున్న పోలీసులు ఈ డ్రగ్స్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ? వీరికి ఈ డ్రగ్స్ ను ఎవరు విక్రయించారు? ఇంకా ఈ డ్రగ్స్ దందాలో ఎవరెవరు ఉన్నారు? వంటి అనేక కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.
BJP leader’s son arrested for consuming drugs in #Hyderabad
Cyberabad police arrested Gajjala Vivekanand (37), Director of Manjeera Group of Companies and son of Bharatiya Janata Party leader Gajjala Yoganand, for consuming cocaine along with his friends at a party at Radisson… pic.twitter.com/ab5wIRKHZs
— Sudhakar Udumula (@sudhakarudumula) February 26, 2024