Telangana : తెలంగాణ‌లో క‌రోనా కొత్త వైర‌స్

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కొత్త వేరియెంట్ వైరస్ బీఏ.2.75 (BA.2.75)ను కొనుగొన్నారు. ఈ వేరియెంట్ ను గుర్తించిన విష‌యాన్ని ఇజ్రాయెల్ శాస్త్రవేత్త డాక్టర్ షే ఫ్లీషాన్ వెల్ల‌డించారు.

  • Written By:
  • Publish Date - July 5, 2022 / 08:30 PM IST

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కొత్త వేరియెంట్ వైరస్ బీఏ.2.75 (BA.2.75)ను కొనుగొన్నారు. ఈ వేరియెంట్ ను గుర్తించిన విష‌యాన్ని ఇజ్రాయెల్ శాస్త్రవేత్త డాక్టర్ షే ఫ్లీషాన్ వెల్ల‌డించారు. తెలంగాణ‌తో పాటు దేశంలోని పది రాష్ట్రాల్లో కరోనా ఈ సబ్ వేరియంట్‌ను గుర్తించినట్టు పేర్కొన్నారు. టెల్ హాషోమర్‌లోని షెబా మెడికల్ సెంటర్‌లోని సెంట్రల్ వైరాలజీ లాబొరేటరీకి చెందిన షీఫ్లాన్ ఈ మేరకు ట్వీట్ చేశారు.

ఇప్పటి వరకు ఇండియా (పది రాష్ట్రాల నుంచి) అలాగే, ఏడు ఇతర దేశాల నుంచి 85 స్వీక్వెన్స్‌లు అప్‌లోడ్ చేసినట్టు చెప్పారు. అయితే, ఇండియా వెలుపల స్వీక్వెన్స్‌ల నుంచి ఎలాంటి ట్రాన్స్‌మిషన్‌ను ట్రాక్ చేయలేదని చెప్పారు. జులై రెండో తేదీ నాటికి మహారాష్ట్రలో 27, పశ్చిమ బెంగాల్‌లో 13, ఢిల్లీ, జమ్ము, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కోటి, హర్యానాలో ఆరు, హిమాచల్ ప్రదేశ్‌లో మూడు, కర్ణాటకలో 10, మధ్యప్రదేశ్‌లో 5, తెలంగాణలో రెండుతో పాటు మొత్తంగా 69 కేసుల్లో కొత్త సబ్ వేరియంట్‌ను గుర్తించినట్టు షీఫ్లాన్ వెల్ల‌డించారు. ఈ వేరియంట్ ఆందోళ‌న‌కరంగా మారుతుంద‌ని ఆయన హెచ్చరించారు.