ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, పార్టీ విప్ యెన్నం శ్రీనివాసరెడ్డి ఈ రోజు సిట్ ఎదుట హాజరుకానున్నారు. బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో తన ఫోన్ను అక్రమంగా ట్యాప్ చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసిన తొలి ప్రజాప్రతినిధుల్లో యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఒకరు. సిట్ అధికారులు క్రైమ్ నంబర్ 243కు సంబంధించిన దర్యాప్తు నేపథ్యంలో మే 31న ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు సంస్థకు ఆయన వాంగ్మూలం కీలక సమాచారాన్ని అందించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గతంలో తన ఫోన్ను ట్యాప్ చేసిందని ఆరోపిస్తూ అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా, సిట్ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, పార్టీ విప్ యెన్నం శ్రీనివాసరెడ్డి ఈ రోజు సిట్ ఎదుట హాజరుకానున్నారు. బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో తన ఫోన్ను అక్రమంగా ట్యాప్ చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసిన తొలి ప్రజాప్రతినిధుల్లో యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఒకరు. సిట్ అధికారులు క్రైమ్ నంబర్ 243కు సంబంధించిన దర్యాప్తు నేపథ్యంలో […]

Phone Tapping
Last Updated: 01 Jun 2026, 01:20 PM IST