సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి బిఆర్ఎస్ (BRS) శ్రేణులపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఫ్రీ బస్ పథకానికి (Free Bus Scheme
) అడ్డస్తే బీఆర్ఎస్ శ్రేణులపైకి ఆర్టీసీ ప్రగతి రథాలు ఎక్కిస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి తనదైన పాలనా కొనసాగిస్తూ ఎన్నికల హామీలను నెరవేరుస్తూ వస్తున్న సీఎం..ఈరోజు ‘మహాలక్ష్మి స్వశక్తి’ పథకాన్ని (Mahalakshmi Swashakti Scheme) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రారంభించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ..బిఆర్ఎస్ శ్రేణులు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం వద్దని బీఆర్ఎస్ వాదిస్తోందని .. ఫ్రీ బస్ పథకానికి అడ్డస్తే బీఆర్ఎస్ శ్రేణులపైకి ఆర్టీసీ ప్రగతి రథాలు ఎక్కిస్తామని హెచ్చరించారు. రానున్న అయిదేళ్లలో మహిళా సంఘాలోని 63 లక్షల మంది మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మహిళా శక్తి పథకం ప్రారంభించినట్లు రేవంత్రెడ్డి తెలిపారు. మహిళల సామాజిక భద్రత కోణంలో సంఘాల బలోపేతం, సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించేందుకే ఈ పథకం తీసుకొచ్చినట్లు స్పష్టం చేసారు. మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలు, వచ్చే అయిదేళ్లలో లక్ష కోట్ల ఆర్థిక సహకారం అందుతుందని అన్నారు.
మహిళా సంఘాల సభ్యులకు నైపుణ్య శిక్షణ, ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పనకు తోడ్పడుతోందని వివరించారు. అలాగే స్వయం సహాయక సంఘాలను ఐఐటీ, ఐఐఎం, ఎస్బీఐ, ఆర్ఎంఏతో అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలిందని , ఏనాడు ఆయన మహిళల సమస్యలు పట్టించుకోలేదన్నారు. మాట తప్పని, మడమ తిప్పని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. తల్లుల కడుపుకోత గుర్తించి, ఆ బాధను చూడలేక కనికరించిందని చెప్పారు. కళ్లముందు భర్తను కొల్పోయిన మహిళ.. ఏపీలో పార్టీ చచ్చిపోయిన పర్వాలేదు.. కేంద్రంలో అధికారం పోయిన లెక్కచేయకుండ తెలంగాణ ఇచ్చిందని పొగిడారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ, సోనియమ్మ అన్నారు. మహిళా నాయకత్వంలో పనిచేస్తుంటే గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.
Read Also : Mahalakshmi Swashakti Scheme : ‘మహాలక్ష్మి స్వశక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్