CM Revanth Reddy : ఢిల్లీకి బయలు దేరిన సీఎం రేవంత్ ..

మంత్రి వర్గ విస్తరణపై పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది

  • Written By:
  • Updated On - July 3, 2024 / 02:32 PM IST

నేడు సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రి వర్గ విస్తరణపై పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పీసీసీ చీఫ్‌ నియామకంపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అలాగే ఖర్గే సమక్షంలో సీనియర్ నేత కేకే కాంగ్రెస్‌లో చేరనున్నారు. రాజ్యసభ ఎంపీ పదవికి ఈరోజు కేకే రాజీనామా చేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు టచ్‌లో పెద్దసంఖ్యలో BRS ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు తెలుపడం జరిగింది. ఇప్పుడు అదే జరుగుతుండడంతో ఎవరు ఎప్పుడు పార్టీ మారతారని టెన్షన్ లో బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఉంది. ఇక జులై 04 న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet) జరగబోతున్నట్లు తెలుస్తుంది. గత కొద్దీ రోజులుగా రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే దిశగా కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకం తో పాటు మంత్రి వర్గంలో ఖాళీగా ఉన్న 06 స్థానాలకు భర్తీ చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం సిద్ధం అయ్యింది. ఈ నెల 4న మంత్రివర్గణ విస్తరణ ఉండే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉన్నాయి. ఇందులో కేవలం 4 మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉందని గాంధీ భవన్ (Gandhi Bhavan) వర్గాలు అంటున్నాయి. మరో 2 ఖాళీలను ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టే అవకాశం ఉందట. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ పేర్లు ఇప్పటికే ఫైనల్ అయ్యాయన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. వీరిని పలు శాఖలకు మంత్రులుగా ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఈరోజు సీఎం రేవంత్ వీటి అన్నింటి ఫై అధిష్టానం తో చర్చలు జరిపి ఓ నిర్ణయానికి రానున్నారు.

Read Also : IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం.. బీసీసీఐ ముందు కీల‌క డిమాండ్‌!