CM KCR: కానిస్టేబుల్ అభ్యర్థులకు సీఎం గుడ్ న్యూస్ ..కటాఫ్ మార్కులు తగ్గింపునకు గ్రీన్ సిగ్నల్..!!

కానిస్టేబుల్ అభ్యర్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. కటాఫ్ మార్కులు తగ్గింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

  • Written By:
  • Updated On - September 12, 2022 / 10:40 PM IST

కానిస్టేబుల్ అభ్యర్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. కటాఫ్ మార్కులు తగ్గింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో కేసీఆర్ స్వయంగా ప్రకటన చేశారు. కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తామన్నారు. దీనిపై కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 17828కోట్లు తెలంగాణకు రావాలన్న సీఎం కేసీఆర్…వీటిని కూడా కేంద్రం ఇప్పించడం లేదని మండిపడ్డారు. ఏపీకి రూ. 6వేల కోట్లు నెల రోజులు కట్టాలని అంటున్నారు…ఇవ్వాల్సిన 3వేల కోట్లు 18శాతం వడ్డీతో ఆరువేల కోట్లు కట్టాలంటున్నారని ఫైర్ అయ్యారు.

నేను చెప్పేది అబద్దమైతే రాజీనామా చేస్తానని ప్రకటించారు. కేంద్రం అన్నీ అమ్ముతోందని..వ్యవసాయం, విద్యుత్ ఈ రెండు మాత్రమే మిగిలాయన్నారు. వీటినికూడా సంస్కరణల పేరుతో అమ్మేందుకు రెడీ అయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాకలో పండే పంటను సిద్ధిపేటలో అమ్మే పరిస్థితి రాదన్నారు. కేంద్రం చెప్పే మాయమాటలు విని మోసపోవద్దన్నారు సీఎం కేసీఆర్ .