Site icon HashtagU Telugu

BRS ‘Sveda Patras’ : బీఆర్‌ఎస్‌ స్వేదపత్రం విడుదల వాయిదా

Brs Power Point Presentatio

Brs Power Point Presentatio

కాంగ్రెస్ ‘శ్వేత పత్రానికి’ ధీటుగా బీఆర్ఎస్ విడుదల చేయాలనుకున్న ‘స్వేదపత్రం’ (Sveda Patras) రేపటికి వాయిదా పడింది (Postponed ). వాస్తవానికి ఈరోజు ఉదయం 11 గంటలకు స్వేద పత్రాన్ని విడుదల చేస్తామని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power Point Presentation) చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ట్విట్టర్లో ప్రకటించారు. కానీ ఈరోజు అనూహ్యంగా కార్యక్రమం వాయిదా పడింది. రేపు(ఆదివారం) ఈ కార్యక్రమం ఉంటుందని, ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో ‘స్వేదపత్రం’ విడుదల చేస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి.

కేటీఆర్ ‘స్వేదపత్రం’ విడుదల చేస్తామని చెప్పగానే అందరిలో ఆసక్తి మొదలైంది. కేటీఆర్ అసలు చెపుతారో..ఏం చూపిస్తారో..దీనికి కాంగ్రెస్ సమాధానం ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అలాగే మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొంటారని పార్టీ వర్గాలు కూడా వెల్లడించాయి. అయితే చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ కార్యక్రమం వాయిదా పడింది.

పదేళ్ల కేసీఆర్‌ (KCR) పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెపుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Govy) శ్వేత పత్రాన్ని (Swetha Patram) విడుదల చేయగా..తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యయనం అంటూ ప్రజలకు తెలియజేసేందుకు బిఆర్ఎస్ (BRS) ‘స్వేద‌ప‌త్రం’ పేరిట ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ (Power Point Presentation) చేయబోతుంది.

We’re now on WhatsApp. Click to Join.

తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని, పగలూ రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ పాల‌న‌లో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ప‌ల్లె ప్ర‌గ‌తి నుంచి మొదలు టీఎస్ ఐపాస్ వ‌ర‌కు ప్ర‌తి ప‌థ‌కం.. అనేక అభివృద్ధి, సంక్షేమ ఫ‌లాల‌ను అందించిందన్నారు. గ‌ణాంకాల‌తో స‌హా.. వాస్త‌వ తెలంగాణ ముఖ‌చిత్రాన్ని వివ‌రిస్తాం. అప్పులు కాదు.. రాష్ట్రం సృష్టించిన సంప‌ద‌ను ఆవిష్క‌రిస్తామ‌ని కేటీఆర్ తెలిపారు.

ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల రూపురేఖ‌లు మారిపోయాయని , అనేక సంక్షేమ ప‌థ‌కాల‌తో పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వ‌ర‌కు ఎంతో ప్ర‌యోజ‌నం జరిగిందని, అంత గొప్ప‌గా ప్ర‌జా పాల‌న సాగించిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందని కేటీఆర్ తెలిపారు. మరి ఈ ‘స్వేద‌ప‌త్రం’ పేరిట ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ ఎలా ఉండబోతుందో రేపు చూడాలి.

Read Also :AP : రేవంత్ బాటలో జగన్..సంక్రాంతి నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం..?