హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై బీఆర్ఎస్ లీడర్ కుమారుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత కుమారుడు పోలీసుల అదుపులో ఉన్నాడు 17 ఏళ్ల బాధితురాలు మీర్చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మైనర్ అత్యాచారం కేసులో బీఆర్ఎస్ నాయకుడి కుమారుడిపై కేసు నమోదైంది. నిందితుడు రిజ్వాన్ అలీ బక్రీ గత మూడు నెలలుగా తనను వేధిస్తున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు మిర్చౌక్ పోలీసులు తెలిపారు. మొదట్లో అతను ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి, ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు, కానీ తరువాత ఆమె కాల్స్, మెసేజ్లకు స్పందించడం మానేశాడు, దీంతో బాధితురాలు న్యాయం కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. రిజ్వాన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుడు ఇనాయత్ అలీ బక్రీ కుమారుడిగా పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదును సీల్డ్ కవర్లో తీసుకొని మహిళా పోలీసు అధికారి సమక్షంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రిజ్వాన్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, బాలికను వైద్య పరీక్షలకు పంపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
Also Read: YSRCP : పలాసలో మంత్రి అప్పలరాజుకు షాక్.. కొత్త అభ్యర్థి బరిలోకి యోచనలో వైసీపీ అధిష్టానం