Bandi Comments: కేసీఆర్ కు సీఎం పీఠంపై కూర్చునే అర్హత లేదు!

అంబేద్కర్ రాజ్యాంగమంటే కేసీఆర్ కు గిట్టదనీ.. కల్వకుంట్ల రాజ్యాంగం తేవాలనుకుంటున్నారనీ రిజర్వేషన్లు లేని కుటుంబ పాలనకే పరిమితమయ్యే రాజ్యాంగం తేవడమే కేసీఆర్ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

  • Written By:
  • Updated On - February 7, 2022 / 01:26 PM IST

అంబేద్కర్ రాజ్యాంగమంటే కేసీఆర్ కు గిట్టదనీ.. కల్వకుంట్ల రాజ్యాంగం తేవాలనుకుంటున్నారనీ రిజర్వేషన్లు లేని కుటుంబ పాలనకే పరిమితమయ్యే రాజ్యాంగం తేవడమే కేసీఆర్ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధుల సమావేశంలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై చట్ట, న్యాయపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై బీజేపీ నాయకులు చర్చించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగే అవినీతి బయటకు రావొద్దనే లక్ష్యంతోనే కేసీఆర్ ప్రజలను దారి మళ్లించేందుకు జరుగుతున్న కుట్ర అని అరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెరమరుగు చేయడం అందులో భాగమేనని ఏ రాజ్యాంగం మీద సీఎంగా ప్రమాణం చేశారో.. అదే రాజ్యాంగం ద్వారా మరో వ్యక్తి సీఎం కాకూడదని కేసీఆర్ భావిస్తున్నారని బండి అన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భ్రుతి, ఉద్యోగాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారని, తాను ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల రాజ్యాంగం వస్తే తన కుటుంబం మాత్రమే రాజ్యం ఏలాలన్నది కేసీఆర్ కుట్ర. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కేసీఆర్ కు ఉన్న ఇబ్బందులేమిటో చెప్పాలని బండి డిమాండ్ చేశారు.

భారత రాజ్యాంగంపై నమ్మకం లేనప్పుడు.. సీఎం పీఠంపై కూర్చునే అర్హత కేసీఆర్ కు లేదనీ, ఏదైనా ఇబ్బందులుంటే రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం ఉందనీ. ఇప్పటికి 105 సార్లు సవరణలు చేశారు. కానీ పూర్తిగా రాజ్యాంగాన్ని తిరగరాయాలని అంటున్నారటే కేసీఆర్ లో ఉన్న అహంకార భావం కన్పిస్తోంది అని పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మేధావులు పూర్తి స్థాయిలో స్పందించకపోవడం బాధాకరమని, మేధావులు, న్యాయవాదులు, విద్యావేత్తలు.. కేసీఆర్ వ్యాఖ్యలపై లోతుగా చర్చించాలని, కేసీఆర్ దారి మళ్లిస్తున్నా బీజేపీ మాత్రం ఆ ఉచ్చులో పడబోదు అని బండి అన్నారు. 317 జీవో, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ సహా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు , బిజెపి లీగల్ సెల్ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ గారు, బార్ కౌన్సిల్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.