Massive Fire Accident: బ్రేకింగ్.. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం

హైదరాబాద్ లోని కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం (Massive Fire Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున సాయి నగర్ కాలనీలోని టింబర్ డిపోలో మంటలు అంటుకున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Massive Fire Accident

Resizeimagesize (1280 X 720) 11zon

హైదరాబాద్ లోని కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం (Massive Fire Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున సాయి నగర్ కాలనీలోని టింబర్ డిపోలో మంటలు అంటుకున్నాయి. డిపోలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. కాగా ఈ మంటల్లో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమైనట్టుగా తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చారు. మృతదేహాల కోసం గాలిస్తున్నారు. స్థానికుల సమాచారంతో అక్కడకి చేరుకున్న అధికారులు, ఫైర్ సిబ్బంది అక్కడకి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు.

Also Read: UP Gangster: యూపీ గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ హతం.. అతని సోదరుడు కూడా…

మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని అధికారులు తెలిపారు. మృతులు వరంగల్ కు చెందిన నరేష్, సుమ, బాబు అని సమాచారం. పక్కనున్న ఇళ్లకు మంటలు అంటుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

  Last Updated: 16 Apr 2023, 11:44 AM IST