Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వన్డే ప్రపంచకప్ తర్వాత చాలా తక్కువ మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్ 2024లో అతని పునరాగమనం టీ20 ప్రపంచకప్కు ముందు అవసరం. IPL 2024 మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం కోహ్లీ ఇంగ్లాండ్లో ఉన్నాడు. అతను వచ్చే వారం RCB క్యాంపులో చేరే అవకాశముంది. ఐపీఎల్ 17వ సీజన్లో విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి బీసీసీఐ అధికారి ఒకరు తాజా సమాచారం అందించారు.
విరాట్ కోహ్లీ IPL 2024 ఆడతాడని, అయితే అతను ఎప్పుడు జట్టులో చేరతాడనేది దానిపై ఫ్రాంచైజీపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం బ్రేక్లో ఉన్నాడు. ఖచ్చితంగా IPL 2024 ఆటగాళ్లందరి ఎంపికలో పెద్ద పాత్ర పోషిస్తుందని ఒక సీనియర్ BCCI అధికారి పేర్కొన్నారు.
Also Read: Space To Sea : మన ‘గగన్యాన్’ జరగబోయేది ఇలాగే.. వీడియో చూడండి
మార్చి 19న కోహ్లీ RCB క్యాంపులో చేరే అవకాశం
విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్తో ఆడిన టెస్ట్ సిరీస్ నుండి విరామం తీసుకున్నాడు. ఆ తర్వాత తన రెండో సంతానం అకాయ్ కోహ్లీ పుట్టిన విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా కింగ్ కోహ్లీ తెలియజేశాడు. విరాట్ ఇప్పటికీ తన కుటుంబంతో UK లో ఉన్నాడు. వచ్చే వారం మార్చి 19న బెంగళూరులో జరిగే ఆర్సీబీ క్యాంపులో కోహ్లీ చేరే ఛాన్స్ ఉందని సమాచారం.
టీ20 ప్రపంచకప్కు ముందు ఐపీఎల్ కీలకం
జూన్లో ప్రారంభమయ్యే ICC T20 వరల్డ్ 2024 దృష్ట్యా విరాట్ కోహ్లీ IPL 2024 ఆడటం చాలా ముఖ్యం. ఈ ఐసీసీ ఈవెంట్లో భారత మాజీ కెప్టెన్ ఆడాలనుకుంటే అతను 17వ ఐపీఎల్ సీజన్లో ఆడాల్సి ఉంటుంది. వన్డే ప్రపంచకప్ తర్వాత అతను టీమ్ ఇండియా తరఫున చాలా తక్కువ మ్యాచ్లు ఆడాడు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ ఐపీఎల్లో అద్భుతంగా రాణించి జట్టులోకి తిరిగి వస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join