సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2న టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం తిరువనంతపురం నుంచి ఎయిర్పోర్ట్ వరకు టీమిండియా సభ్యులు బస్సులో బయలుదేరారు.హోటల్ బయట అప్పటికే అభిమానులు భారీ ఎత్తున ఉన్నారు. భారత్ క్రికెటర్లు బస్సు ఎక్కగానే.. అభిమానులు పెద్ద ఎత్తున అరిచారు.
ఇక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని చూడగానే అభిమానుల్లో మరింత జోష్ వచ్చింది. కోహ్లీ.. కోహ్లీ అంటూ గట్టిగా అరిచారు. అభిమానుల అరుపులు బస్సులో ఉన్న విరాట్ కోహ్లీకి వినబడ్డాయి. ఆ సమయంలో కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. అభిమానుల పిలుపుకు స్పందించిన కోహ్లీ.. వెంటనే బస్సు అద్దంలో నుంచి అనుష్కతో వీడియో కాల్ మాట్లాడుతున్నా అని తన ఫోన్ను చూపించాడు. దాంతో ఫాన్స్ మరింత గట్టిగా అరవగా.. ఫ్యాన్స్కు ఫోన్ చూపిస్తూ ‘‘అనుష్కతో వీడియో కాల్లో ఉన్నా.. డిస్టర్బ్ చేయకండి’’ అంటూ కోహ్లీ నవ్వాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.