ఈ విజయం భారత్‌ కు అంకితం..కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav : టీ 20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 77 పరుగులతో హీరోగా నిలిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విజయాన్ని దేశానికి అంకితం చేశాడు. బౌలర్లు అద్భుతంగా రాణించడంతో పాకిస్తాన్ కుప్పకూలింది. ఈ గెలుపుతో భారత్ సూపర్ – 8 దశకు మరింత దగ్గరైంది. పాయింట్ల పట్టికలో యూఎస్ఏ రెండో స్థానంలో ఉండగా, పాకిస్తాన్ మూడో స్థానానికి వెళ్లింది. విజయం […]

Published By: HashtagU Telugu Desk
Suryakumar Yadav

Suryakumar Yadav

Suryakumar Yadav : టీ 20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 77 పరుగులతో హీరోగా నిలిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విజయాన్ని దేశానికి అంకితం చేశాడు. బౌలర్లు అద్భుతంగా రాణించడంతో పాకిస్తాన్ కుప్పకూలింది. ఈ గెలుపుతో భారత్ సూపర్ – 8 దశకు మరింత దగ్గరైంది. పాయింట్ల పట్టికలో యూఎస్ఏ రెండో స్థానంలో ఉండగా, పాకిస్తాన్ మూడో స్థానానికి వెళ్లింది.

  • విజయం మొత్తం భారత్‌కే అంకితం
  • ఇషాన్ కిషన్ ఆట తీరు అద్భుతం
  • కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వన్ సైడ్ విక్టరీ సాధించింది. కొలంబో వేదికగా జరిగిన ఈ పోరులో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి అభిమానులకు పండగ వాతావరణం తీసుకొచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన ఆటగాడు ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టును గెలుపు బాట పట్టించాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్య ఈ విజయాన్ని భారతదేశానికి అంకితం చేశాడు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఇషాన్ మాట్లాడుతూ “ఆరంభంలో పిచ్ కాస్త కష్టంగా అనిపించింది. కానీ నా బలాలపై నమ్మకం పెట్టుకుని ఆడాను. ఆఫ్‌సైడ్‌పై చాలా కష్టపడ్డాను. 160–170 పరుగులు చేస్తే సరిపోతుందని అనుకున్నాను. భారత్–పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడూ స్పెషల్” అని తెలిపాడు.

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇషాన్ ప్రదర్శనను ప్రశంసించాడు. “ఈ విజయం మొత్తం భారత్‌కే అంకితం. తొలి వికెట్ త్వరగా పడిపోయాక బాధ్యత తీసుకున్న విధానం అద్భుతం. ఇషాన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాడు. 175 పరుగులు ఈ పిచ్‌పై చాలా మంచి స్కోరు” అని సూర్య పేర్కొన్నాడు. అలాగే బౌలింగ్ విభాగం కూడా సమష్టిగా రాణించిందని సూర్య తెలిపారు. “అందరూ కలిసి పోరాడారు. ఇదే మన బలమని మరోసారి నిరూపించాం. జట్టుగా కలిసి ఆనందించి, తర్వాతి మ్యాచ్‌లపై దృష్టి పెడతాం” అని అన్నాడు.

మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా తమ జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. “మన స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఎగ్జిక్యూషన్ లోపించింది. బ్యాటింగ్‌లో పవర్‌ప్లేలోనే ఎక్కువ వికెట్లు కోల్పోయాం. ఇలాంటి మ్యాచ్‌ల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని నియంత్రించుకోవాలి. ఇప్పుడు మా ముందున్న మ్యాచ్ గెలవాల్సిందే. అప్పుడు మాత్రమే సూపర్-8 అవకాశాలు ఉంటాయి” అని చెప్పాడు.

ఈ గెలుపుతో భారత్ టోర్నీలో మరింత బలంగా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ సమతూకం చూపిస్తూ, ప్రత్యర్థులకు స్పష్టమైన హెచ్చరిక పంపింది. ఆడిన మూడు మ్యాచ్‌లలో విజయం సాధించిన భారత జట్టు సూపర్ 8 బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన పాకిస్తాన్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది.

 

  Last Updated: 16 Feb 2026, 08:53 AM IST