Cricketer Wife: బీజేపీలో ప్రముఖ నాయకురాలిగా ఎదుగుతున్న స్టార్ క్రికెటర్ భార్య.. ఆమె ఎవరో తెలుసా?

భారతీయ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య భారతీయ జనతా పార్టీ నాయకురాలు. ఆమె పేరు రివాబా జడేజా. వీరిద్దరూ 2016 సంవత్సరంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

Published By: HashtagU Telugu Desk
Cricketer Wife

Cricketer Wife

Cricketer Wife: భారతీయ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య (Cricketer Wife) భారతీయ జనతా పార్టీ నాయకురాలు. ఆమె పేరు రివాబా జడేజా. వీరిద్దరూ 2016 సంవత్సరంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రవీంద్ర జడేజా భార్య భారతీయ జనతా పార్టీ నాయకురాలు. ఆమె గుజరాత్‌లోని జామ్‌నగర్ నుండి శాసనసభ్యురాలు. ఆమె 2022 సంవత్సరంలో ఎన్నికల్లో గెలిచి శాసనసభ్యురాలు అయ్యారు.

రివాబా గుజరాత్‌లోని జామ్‌నగర్ నార్త్ సీటు నుండి బీజేపీ శాసనసభ్యురాలు. రివాబా నవంబర్ 2, 1990లో జన్మించింది. ఆమె తండ్రి హర్దేవ్ సోలంకి ఒక వ్యాపారవేత్త. ఆమె తల్లి ప్రఫుల్లబా సోలంకి భారతీయ రైల్వేలో ఉద్యోగం చేసేవారు. రివాబా రాజ్‌కోట్‌లోని అత్మియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. రివాబా 2019 సంవత్సరంలో బీజేపీ సభ్యురాలు అయ్యారు. అంతకుముందు ఆమె కర్ణి సేనా మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు.

Also Read: MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత మరో కీలక ప్రకటన.. ఏంటంటే?

రిపోర్టుల ప్రకారం.. రివాబా, జడేజా ఒక పార్టీలో కలుసుకున్నారు. ఆ తర్వాత వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి, వివాహం చేసుకున్నారు. రివాబా జడేజాకు మద్దతు ఇవ్వడానికి చాలాసార్లు మైదానంలోకి వెళుతూ ఉంటారు. రివాబా- జడేజాకు ఒక కుమార్తె కూడా ఉంది. రివాబా 2017 సంవత్సరంలో కుమార్తెను ప్రసవించారు. వారి కుమార్తె పేరు నిధ్యానా జడేజా. వారిద్దరూ తమ కుమార్తెను సోషల్ మీడియా నుండి దూరంగా ఉంచుతారు. జడేజా గత సంవత్సరం టీ20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఆయన భారత జట్టు తరపున వన్డే, టెస్ట్ క్రికెట్ ఆడుతున్నారు. జడేజా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతనిధ్యం వహిస్తున్నారు. ఈ నెలలో ఆయన టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్ళనున్నారు.

  Last Updated: 01 Jun 2025, 11:42 PM IST