IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. మైదానంలో బ్యాటర్లు పరుగుల వరద పారిస్తుంటే మరోవైపు ఈసారి టైటిల్ గెలిచేది ఎవరు? ప్లేఆఫ్స్కు చేరే జట్లు ఏవి? అనే అంచనాలు, జోస్యాలు అప్పుడే మొదలయ్యాయి. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయర్ శశాంక్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. టోర్నమెంట్ ప్రారంభ సమయంలో శశాంక్ సింగ్ ఈ ఏడాది ప్లేఆఫ్స్ రేసులో నిలిచే మొదటి నాలుగు జట్ల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
ప్లేఆఫ్స్కు చేరే ఆ 4 జట్లు ఇవే!
పంజాబ్ కింగ్స్ (PBKS): తన సొంత జట్టుపై శశాంక్ పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఈసారి పంజాబ్ కింగ్స్ ఖచ్చితంగా ప్లేఆఫ్స్కు చేరుతుందని ఆయన ధీమాగా చెప్పాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): పంజాబ్ తర్వాత ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకునే రెండో జట్టుగా ఆర్సీబీని ఎంచుకున్నాడు. ఆర్సీబీ అభిమానులకు ఇది నిజంగా పెద్ద శుభవార్తే.
ముంబై ఇండియన్స్ (MI): ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి కూడా టాప్-4లో ఉంటుందని శశాంక్ జోస్యం చెప్పాడు.
Also Read: Poonam Pandey: పూనమ్ పాండే బేబీ బంప్ ఫొటోలు వైరల్
నాల్గవ స్థానం కోసం పోటీ: నాల్గవ జట్టు విషయంలో ఆయన ఒక ఖచ్చితమైన పేరు చెప్పకుండా రెండు జట్ల మధ్య గట్టి పోటీ ఉంటుందని విశ్లేషించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) లేదా లక్నో సూపర్ జెయింట్స్ (LSG) లలో ఎవరో ఒకరు ప్లేఆఫ్స్ చేరుతారని ఆయన అభిప్రాయపడ్డాడు.
టైటిల్ విజేత ఎవరు?
అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఫైనల్ చేరే జట్లు ఏవైనా కావచ్చు కానీ 2026 ఐపీఎల్ ట్రోఫీని మాత్రం పంజాబ్ కింగ్స్ మాత్రమే ముద్దాడుతుందని శశాంక్ సింగ్ చాలా గట్టిగా చెప్పాడు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవని పంజాబ్ కింగ్స్కు ఈ ఏడాది అదృష్టం కలిసి వస్తుందని ఆయన నమ్ముతున్నాడు.
