IND vs PAK: ఇండియా-పాక్ మ్యాచ్ కు జనమే జనం.. యువరాజ్, సచిన్, అనుష్క సందడి

అహ్మదాబాద్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ కొనసాగుతుంది.

  • Written By:
  • Updated On - October 14, 2023 / 02:53 PM IST

IND vs PAK: అహ్మదాబాద్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ కొనసాగుతుంది. ముఖ్యంగా పాకిస్థాన్ మ్యాచ్ కావడంతో అభిమానులు, సెలబ్రిటీలతో స్టేడియంలో లెక్కకు మించి జన సందడి నెలకొంది. మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సైతం వచ్చేశాడు. ఇక ఇక ఈ మ్యాచ్ చూసేందుకు టీమిండియా కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీ భార్య, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా అహ్మదాబాద్ వచ్చేసింది. ఈ మ్యాచ్ కోసమే ఆమె ఇక్కడకు వచ్చింది. ఆమె ఎయిర్‌పోర్టులో దిగిన కొన్ని ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ప్రయాణించిన ఫ్లైట్‌లో సచిన్ టెండూల్కర్, దినేష్ కార్తీక్ కూడా ఉండటం గమనార్హం.

విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేనప్పుడు కూడా భర్తను సపోర్ట్ చేయడానికి అనుష్క ఇలాగే స్టేడియానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కోహ్లీ మంచి ఫామ్ అందుకున్న నేపథ్యంలో పాకిస్తాన్‌ను కోహ్లీ చెడుగుడు ఆడటం ఖాయమని, అది చూసేందుకే అనుష్క వచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇది జస్ట్ క్రికెట్ కాదు యుద్దం అనుకునే ఫ్యాన్స్ అంతా స్టేడియంలోని లక్ష సీట్లను నింపేశారు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో రోహిత్ గెలిచిన తొలి టాస్ ఇదే కావడం గమనార్హం.

మ్యాచ్‌ను చక్కగా ఆరంభించి, తమలోని బెస్ట్ చూపించాలని అనుకుంటున్నట్లు రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరల్డ్ కప్ లో ఇప్పటికే రెండు అర్దశతకాలు బాది తానెంత ప్రమాదకారో మరోసారి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీ చేశాడు. ఇక వరల్డ్ కప్ లో హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రేక్షకులతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. అహ్మదాబాద్ వేదికగా ఇండియా-పాక్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో సత్తా చాటాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

Also Read: Anil Ravipudi: భగవంత్ కేసరి ఒక ఎమోషనల్ జర్నీ, ఇంటర్వెల్ ఎపిసోడ్ తో గూస్‌బంప్స్ : అనిల్ రావిపూడి