బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీ కి బిగ్ షాక్.. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ లో మార్పు.!

ICC Chairman Jay Shah  భారత్ – బంగ్లాదేశ్ క్రికెట్ వివాదం టీ 20 వరల్డ్ కప్‌కు పాకింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ నుంచి ముస్తఫిజుర్ రహ్మాన్ విడుదలతో మొదలైన రచ్చ, భద్రతా కారణాలు చూపుతూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఐసీసీకి లేఖ రాయడంతో తీవ్రమైంది. దీంతో ఐసీసీ కొత్త షెడ్యూల్ రూపొందించే పనిలో పడిందని సమాచారం. ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చింది. ఐపీఎల్ […]

Published By: HashtagU Telugu Desk
Jay Shah Springs Into Action After Bangladesh

Jay Shah Springs Into Action After Bangladesh

ICC Chairman Jay Shah  భారత్ – బంగ్లాదేశ్ క్రికెట్ వివాదం టీ 20 వరల్డ్ కప్‌కు పాకింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ నుంచి ముస్తఫిజుర్ రహ్మాన్ విడుదలతో మొదలైన రచ్చ, భద్రతా కారణాలు చూపుతూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఐసీసీకి లేఖ రాయడంతో తీవ్రమైంది. దీంతో ఐసీసీ కొత్త షెడ్యూల్ రూపొందించే పనిలో పడిందని సమాచారం. ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చింది.

  • ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రహ్మాన్ రిలీజ్
  • భారత్‌లో టీ20 వరల్డ్‌కప్ ఆడబోమన్న బంగ్లా క్రికెట్
  • కొత్త షెడ్యూల్ పనిలో పడిన ఐసీసీ

భారత్ – బంగ్లాదేశ్ మధ్య రాజకీయంగా రాజుకున్న అగ్గి ఇప్పుడు క్రికెట్‌లోకి కూడా వచ్చేసింది. ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్‌ను రిలీజ్ చేయడంతో మొదలైన రచ్చ.. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ వరకూ పాకింది. భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధికారికంగా లేఖ రాయడంతో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త షెడ్యూల్ రూపొందించే పనిలో పడినట్లు సమాచారం. భద్రతా కారణాలనే ప్రధాన కారణంగా చూపుతూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడడం తమకు సాధ్యం కాదని బీసీబీ స్పష్టం చేసింది.

నేషనల్ మీడియా కథనం ప్రకారం.. ఐసీసీ చైర్మన్ జై షా నేతృత్వంలో టోర్నీ షెడ్యూల్‌ను తిరిగి సమీక్షించే ప్రక్రియ మొదలైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజూర్ రహమాన్‌ను విడుదల చేయాలంటూ బీసీసీఐ ఆదేశించడంతో ఈ వివాదానికి బీజం పడింది. అబుదాబి వేలంలో రూ.9.20 కోట్లకు ముస్తఫిజూర్‌ను కొనుగోలు చేసిన కేకేఆర్, బీసీసీఐ సూచనల మేరకు అతడిని జట్టు నుంచి తప్పించింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింస నేపథ్యంలో భారత్–బంగ్లాదేశ్ మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు ఉండగా, ఈ నిర్ణయం రెండు బోర్డుల మధ్య సంబంధాలను మరింత దిగజార్చింది.

ముస్తఫిజూర్ విడుదలైన వెంటనే బీసీబీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, తమ టీమ్ భద్రతపై ఆందోళనలు ఉన్నాయని, అందుకే భారత్‌లో జరిగే తమ అన్ని మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరినట్టు వెల్లడించింది. ఈ నిర్ణయం భారత్–పాకిస్తాన్ తరహాలో మరో క్రికెట్ రాజకీయ వివాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

టోర్నీ ప్రారంభానికి ఇంకా నెల రోజులే ఉండటంతో షెడ్యూల్ మార్పు ఐసీసీకి పెద్ద లాజిస్టిక్ సవాలుగా మారనుంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ గ్రూప్–సీ మ్యాచ్‌లలో మూడు కోల్‌కతాలో ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్, ఫిబ్రవరి 9న ఇటలీతో, ఫిబ్రవరి 14న ఇంగ్లండ్‌తో కోల్‌కతాలో మ్యాచ్‌లు ఉన్నాయి. గ్రూప్ దశలో చివరి మ్యాచ్ ఫిబ్రవరి 17న ముంబై వాంఖడే స్టేడియంలో నేపాల్‌తో జరగాల్సి ఉంది.

ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తరఫున యువజన, క్రీడల శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తీవ్రంగా స్పందించారు. “బంగ్లాదేశ్ క్రికెట్‌, క్రికెటర్లకు అవమానం జరిగితే మేం ఊరుకోం. బానిసత్వం రోజులు పోయాయి. ఒక బంగ్లాదేశ్ క్రికెటర్ భారత్‌లో ఆడలేని పరిస్థితి ఉంటే, మొత్తం జట్టు అక్కడికి వెళ్లడం సురక్షితం కాదనే భావన కలుగుతుంది” అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. బీసీబీ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరాలని తానే సూచించానని కూడా ఆయన వెల్లడించారు.

అంతేకాదు, బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేయాలంటూ సంబంధిత వర్గాలకు లేఖ రాసినట్టు నజ్రుల్ తెలిపారు. బీసీబీ ఐసీసీకి లేఖ రాయడాన్ని స్వాగతిస్తూ, బీసీసీఐ విధానాలపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్‌కు తమ 15 మంది జట్టును ప్రకటించింది. లిట్టన్ కుమార్ దాస్ సారథ్యంలో జట్టు టోర్నీకి సిద్ధమవుతోంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ 20 జట్ల టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఎనిమిది వేదికల్లో జరగనుంది.

  Last Updated: 05 Jan 2026, 12:33 PM IST