Abhishek Sharma: ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించింది. ఈ విజయంతో జట్టు ఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. అయితే ఈ టోర్నమెంట్ అంతటా టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ బ్యాట్ మాత్రం మౌనంగానే ఉంది. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ నుంచి అందరూ ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆశించారు. కానీ అతని బ్యాట్ మరోసారి విఫలమైంది. ఫైనల్ మ్యాచ్కు ముందు అతని ఫామ్ టీమ్ ఇండియాకు ఆందోళన కలిగిస్తుంటే సంజూ శాంసన్కు మాత్రం ఇప్పటికీ అభిషేక్పై నమ్మకం ఉంది. సెమీఫైనల్ విజయం తర్వాత స్టార్ ఓపెనర్ గురించి సంజూ ఏం చెప్పారో చూద్దాం.
అభిషేక్కు మద్దతుగా సంజూ శాంసన్
ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో అభిషేక్ శర్మ 7 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ మ్యాచ్లో సత్తా చాటిన సంజూ శాంసన్ అభిషేక్ ఫామ్పై వస్తున్న విమర్శల గురించి స్పందిస్తూ.. ఫైనల్లో అభిషేక్ పెద్ద ఇన్నింగ్స్ ఆడుతాడు. ఫైనల్ మ్యాచ్ అభిషేక్దే అవుతుంది. అహ్మదాబాద్లో అతను అద్భుతంగా రాణిస్తాడని నేను బలంగా నమ్ముతున్నాను అని అన్నారు. ఇదే సమయంలో సంజూ శాంసన్ వరుణ్ చక్రవర్తికి కూడా మద్దతుగా నిలిచారు. సెమీఫైనల్ మ్యాచ్లో వరుణ్ 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి, కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగారు.
Also Read: జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టిన వారి జాబితా సిద్దం.. త్వరలో వీరి ఆస్తులు సీజ్..!
అభిషేక్ శర్మ వైఫల్యం
అభిషేక్ శర్మకు ఈ టీ20 ప్రపంచకప్ చాలా నిరాశజనకంగా సాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో అతను కేవలం ఒక్కసారి మాత్రమే 50 పరుగుల మార్కును దాటాడు. అది కూడా నమీబియాతో జరిగిన మ్యాచ్లోనే. అంతేకాకుండా 3 మ్యాచ్ల్లో ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. మిగిలిన మ్యాచ్ల్లో కలిపి కేవలం 34 పరుగులే చేశాడు. టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లో నంబర్ 1 బ్యాటర్గా ఉన్న అభిషేక్ నుంచి టీమ్ ఇండియా అతని స్థాయికి తగ్గ ప్రదర్శనను ఆశిస్తోంది. ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ నుంచి జట్టు చాలా ఆశలు పెట్టుకుంది. ఒకవేళ ఆ మ్యాచ్లో కూడా అతను రాణించకపోతే భవిష్యత్ సిరీస్లలో అతని స్థానంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది.
