Shikhar Dhawan: టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన అభిమానులకు మరోసారి ఒక పెద్ద శుభవార్త అందించారు. ఆయన ఇంట్లో మరోసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ధావన్ ఫిబ్రవరి 19న జరిగిన సంగీత్ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనితో ఆయన అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా శిఖర్ ధావన్, సోఫీ షైన్ కలిసి ఉంటున్నారు. వీరిద్దరికీ సంబంధించిన రీల్స్, ఫోటోలు తరచుగా వైరల్ అవుతూనే ఉన్నాయి.
వైరల్ అవుతున్న సంగీత్ వేడుక ఫోటోలు
శిఖర్ ధావన్, సోఫీ షైన్ వివాహం ఇంకా జరగలేదు. కానీ త్వరలోనే జరగబోతోంది. దీనిపై అధికారిక సమాచారం ఏదీ పంచుకోనప్పటికీ వివాహ వేడుకలు మొదలయ్యాయి. సంగీత్ వేడుకకు సంబంధించిన అందమైన ఫోటోలను చూస్తుంటే వారి సంతోషాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 40 ఏళ్ల శిఖర్ ధావన్కు ఇది రెండో వివాహం. సంగీత్ ఫోటోలు బయటకు రాగానే ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫోటోను షేర్ చేస్తూ ఆయన ఒక ప్రత్యేకమైన క్యాప్షన్ కూడా రాశారు. ‘సంగీత్ నైట్, ఆల్మోస్ట్ ద ధవన్స్’ అని రాసుకొచ్చారు.
Also Read: టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!
2023లో విడాకులు
శిఖర్ ధావన్ మొదటి భార్య పేరు అయేషా ముఖర్జీ. శిఖర్, అయేషాకు జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. అతను ప్రస్తుతం తన తల్లితో కలిసి ఉంటున్నాడు. శిఖర్ తన కుమారుడిని ఎంతగానో ప్రేమిస్తారు. ఆ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా చాలాసార్లు వ్యక్తపరిచారు. 2023లో శిఖర్- అయేషా మధ్య అధికారికంగా విడాకులు జరిగాయి. ఇప్పుడు శిఖర్ మరోసారి ప్రేమ మార్గంలో పయనిస్తున్నారు. చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 2న వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు త్వరలోనే వీరిద్దరూ వైవాహిక బంధంతో ఒకటి కాబోతున్నారు.
