Site icon HashtagU Telugu

IPL 2024: ఢిల్లీకి బిగ్ షాక్.. కెప్టెన్ రిషబ్ పంత్ అవుట్

IPL 2024

IPL 2024

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఒక మ్యాచ్‌పై నిషేధానికి గురయ్యాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.30 లక్షల జరిమానా కూడా విధించారు. వివరాలలోకి వెళితే..

మే 7న అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 20 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో పంత్ స్లో ఓవర్ రేట్‌కు పాల్పడ్డాడు. పూర్తి 20 ఓవర్లు బౌలింగ్ చేయడానికి ఢిల్లీ నిర్ణీత సమయం కంటే 10 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుంది. ఢిల్లీ స్లో ఓవర్ రేట్ దెబ్బతినడం ఇదే మొదటిసారి కాద. ఢిల్లీ ఇలా చేయడం ఇది మూడోసారి. అందుకే పంత్‌ను సస్పెండ్ చేశారు, లేకుంటే జరిమానా మాత్రమే విధించేవారు. పంత్‌కు భారీ జరిమానా విధించగా, జట్టు ఆటగాళ్లకు కూడా జరిమానా పడింది. ప్లేయింగ్-11లో భాగమైన జట్టులోని ఆటగాళ్లందరికీ రూ. 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం, ఏది తక్కువైతే అది జరిమానా విధించారు. ఇందులో ఇంపాక్ట్ ప్లేయర్‌లు కూడా ఉన్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ రిఫరీ ఈ నిర్ణయంపై అప్పీల్ చేసింది. కానీ ప్రయోజనం లేకపోయింది. ఢిల్లీ అప్పీల్‌ను బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు కూడా పంపారు. అంబుడ్స్‌మన్ విచారణ జరిపి, మ్యాచ్ రిఫరీ నిర్ణయమే అంతిమమని చెప్పారు. కాగా ఢిల్లీ జట్టు ప్లేఆఫ్ రేసులో ఉంది. తదుపరి రౌండ్‌కు వెళ్లడానికి రెండు మ్యాచ్‌లను గెలవాల్సి ఉంది. అయితే తదుపరి మ్యాచ్‌లో పంత్ లేకపోవడం ఈ జట్టుకు కొంచెం మైనస్ అనే చెప్పాలి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు ఐదో స్థానంలో ఉంది.

Also Read: LS Polls: సాయంత్రం 6 తర్వాత తెలంగాణలో 144 సెక్షన్: సీఈఓ వికాస్ రాజ్