Site icon HashtagU Telugu

T20 World Cup: వరల్డ్ కప్ ను వీడని వరుణుడు సూపర్ 8 రౌండ్ కు వర్షం బెడద

T20 World Cup

T20 World Cup

T20 World Cup: అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ ను వరుణుడు వీడడం లేదు. టోర్నీ ఆరంభం నుంచీ పలు మ్యాచ్ లకు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లలో నాలుగు వర్షం కారణంగా రద్దయితే… ఇంగ్లాండ్, నమీబియా మ్యాచ్ 10 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది. దీంతో పిచ్ లు కూడా బౌలర్లకే అనుకూలిస్తూ తక్కువ స్కోర్లు నమోదవుతుండడం బౌండరీలు, సిక్సర్లు ఆశించిన అభిమానులకు నిరాశను మిగిల్చింది. ఇప్పుడు లీగ్ స్టేజ్ ముగియగా.. సూపర్ 8 మ్యాచ్ లు, సెమీఫైనల్స్ , ఫైనల్స్ అన్నీ కరేబియన్ దీవుల్లోనే జరగనున్నాయి. దీంతో పూర్తిస్థాయి వినోదాన్ని ఆశిద్దామనుకుంటున్న ఫ్యాన్స్ కు మరోసారి నిరాశ కలిగించే వార్త వినిపిస్తోంది.

సూపర్ 8 మ్యాచ్ లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా భారత్ ఆడే మూడు మ్యాచ్ లకూ వరుణుడు అంతరాయం కలిగించడం ఖాయంగా కనిపిస్తోంది. సూపర్ 8లో భారత్ మొదట ఆఫ్ఘనిస్తాన్, తర్వాత బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలతో తలపడనుంది. వీటిలో భారత్, ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న బార్బడోస్ లో మ్యాచ్ జరిగే రోజు 10 శాతం వర్షం కురిసే అవకాశముంది. అలాగే బంగ్లాదేశ్ తో భారత్ సూపర్ 8 మ్యాచ్ కు వేదికగా ఉన్న ఆంటిగ్వాలో 20 శాతం వర్షం పడే అవకాశముంది. ఇక జూన్ 24న సెయింట్ లూసియా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ కు 50 శాతం వర్షం ముప్పు పొంచి ఉంది. మొదటి రెండు మ్యాచ్ లకు పూర్తిస్థాయి వర్షం ముప్పు లేకున్నా… ఆసీస్ తో జరిగే మ్యాచ్ కు మాత్రం ఎక్కువ ముప్పు ఉంది. దీంతో ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లపై గెలుపు భారత్ సెమీస్ అవకాశాలను డిసైడ్ చేయనుంది.

Also Read: Air India: ఎయిర్ ఇండియా ప్రయాణికుడు భోజనంలో బ్లేడ్‌

Exit mobile version