World Cup 2023 Tickets: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 10 నుండి వన్డే వరల్డ్ కప్ ఈ-టికెట్ల విక్రయం..!

వన్డే ప్రపంచకప్ కోసం ఆన్‌లైన్ టిక్కెట్స్ (World Cup 2023 Tickets) విక్రయ ప్రక్రియకు సంబంధించి ఇప్పుడు పెద్ద సమాచారం తెరపైకి వచ్చింది.

  • Written By:
  • Publish Date - July 30, 2023 / 01:12 PM IST

World Cup 2023 Tickets: అక్టోబర్ 5 నుంచి భారత్‌లో ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి ఎక్కడ చూసినా అభిమానుల్లో భిన్నమైన ఉత్సాహం కనిపిస్తోంది. మొట్టమొదటిసారిగా భారతదేశం ఒంటరిగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. అందుకే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సన్నాహాలను చాలా జాగ్రత్తగా చేస్తుంది. వన్డే ప్రపంచకప్ కోసం ఆన్‌లైన్ టిక్కెట్స్ (World Cup 2023 Tickets) విక్రయ ప్రక్రియకు సంబంధించి ఇప్పుడు పెద్ద సమాచారం తెరపైకి వచ్చింది.

ODI వరల్డ్ కప్ కోసం ఈ-టికెట్ల విక్రయం ఆగస్టు 10 నుండి ప్రారంభమవుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. BCCI ఇందుకోసం రెండు పెద్ద ఆన్‌లైన్ టిక్కెట్లను విక్రయించే సంస్థలను కూడా ఖరారు చేసింది. ఇందులో ఒక కంపెనీ బుక్ మై షో కాగా, మరొకటి పేటీఎం. అయితే, ఇవి ఉన్నప్పటికీ అభిమానులు స్టేడియంలోకి ప్రవేశించడానికి భౌతిక టిక్కెట్‌ను కలిగి ఉండటం తప్పనిసరి.

Also Read: Stuart Broad: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న స్టువర్ట్ బ్రాడ్.. ఎప్పుడంటే..?

ఆన్‌లైన్ టిక్కెట్ విక్రయాలకు సంబంధించి రాబోయే ప్రపంచ కప్‌లో సగం మ్యాచ్‌లకు బుక్‌ మై షో, పేటిఎమ్ టిక్కెట్ల విక్రయాలను నిర్వహిస్తాయని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఒక ప్రకటనలో ఒక మూలం తెలిపింది. బుక్ మై షోలో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్, ఫైనల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి. సెమీ-ఫైనల్ మ్యాచ్ టిక్కెట్లు Paytmలో విక్రయించబడతాయి.

ప్రపంచకప్ షెడ్యూల్ మారవచ్చు

కొన్ని వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ మార్పుపై బీసీసీఐ సెక్రటరీ జై షా కొద్దిరోజుల క్రితం ఓ ప్రకటన ఇచ్చారు. ఇందులో అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్ తేదీ కూడా మారే అవకాశం ఉంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు వన్డే ప్రపంచకప్‌లో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది.