KL Rahul Weeding Gifts: కేఎల్ రాహుల్ పెళ్లికి ధోనీ, కోహ్లీ ఖరీదైన కానుకలు.. అవేంటో చూద్దాం..!

భారత క్రికెట్ జట్టు ఆటగాడు కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి పెళ్లి సందర్భంగా వారు చాలా ఖరీదైన బహుమతులు (KL Rahul Weeding Gifts) అందుకున్నారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ బహుమతి కూడా చేరింది. మీడియా కథనాల ప్రకారం.. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ.. రాహుల్, అతియాలకు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చాడు.

  • Written By:
  • Publish Date - January 26, 2023 / 01:45 PM IST

భారత క్రికెట్ జట్టు ఆటగాడు కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి పెళ్లి సందర్భంగా వారు చాలా ఖరీదైన బహుమతులు (KL Rahul Weeding Gifts) అందుకున్నారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ బహుమతి కూడా చేరింది. మీడియా కథనాల ప్రకారం.. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ.. రాహుల్, అతియాలకు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చాడు. మహేంద్ర సింగ్ ధోనీ కవాసకి నింజా బైక్‌ను బహుమతిగా ఇచ్చాడు. దీని ధర దాదాపు 80 లక్షల రూపాయలు. కాగా బీఎండబ్ల్యూ కారు ధర రూ.2 కోట్లకు పైగానే ఉంది.

టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్, అతియా శెట్టి జనవరి 23న వివాహం చేసుకున్నారు. ఓ వార్త కథనం ప్రకారం.. విరాట్ కోహ్లీ రాహుల్ కు BMW కారును బహుమతిగా ఇచ్చాడు. దీని ఖరీదు 2 కోట్ల రూపాయలకు పైమాటే. భారత జట్టు మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఖరీదైన బహుమతి ఇచ్చాడు. ధోనీ కవాసకి నింజా బైక్‌ను బహుమతిగా ఇచ్చాడు. దీని ధర దాదాపు 80 లక్షల రూపాయలు. అతియా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె. పెళ్లి సందర్బంగా సునీల్ ముంబైలో ఉన్న దాదాపు 50 కోట్ల రూపాయల అపార్ట్‌మెంట్‌ను బహుమతిగా ఇచ్చాడు.

అదే సమయంలో సునీల్ శెట్టి సన్నిహితుడు సల్మాన్ ఖాన్ కూడా చాలా ఖరీదైన బహుమతిని ఇచ్చాడు. అతియా, రాహుల్‌లకు సల్మాన్ రూ.1.64 కోట్ల విలువైన ఆడి కారును బహుమతిగా ఇచ్చాడు. జాకీ ష్రాఫ్ గిఫ్ట్ కూడా చాలా స్పెషల్. జాకీ అతియాకు రూ.30 లక్షల విలువైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇది చోపార్డ్ వాచెస్ కంపెనీకి చెందినది.ఇది స్విట్జర్లాండ్ బ్రాండ్. అర్జున్ కపూర్ అతియాకు డైమండ్ బ్రాస్‌లెట్‌ను బహుమతిగా ఇచ్చాడు. దీని ఖరీదు రూ.1.5 కోట్లు.

Also Read: Sharwanand Enguagement : అట్టహాసంగా శర్వానంద్ ఎంగేజ్ మెంట్

రాహుల్, అతియాల సంబంధం గురించి చాలా కాలంగా వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ పెళ్లికి ముందు చాలా సార్లు కలిసి కనిపించారు. రాహుల్, అతియా చాలా కాలం ప్రేమించుకున్న తర్వాత జనవరి 23న వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ త్వరలో ముంబైలో భారీ రిసెప్షన్ నిర్వహించనున్నారు. నిజానికి ధోనీ కానీ, కోహ్లీ దంపతులు వివాహానికి రాలేదు. కాకపోతే ఈ కానుకలు పంపించినట్టు తెలుస్తోంది. క్రికెట్, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లినప్పటికీ.. బిజీ షెడ్యూల్ వల్ల చాలా మంది రాలేకపోయినట్టు సమాచారం. క్రికెటర్లు న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ తో బిజీగా ఉంటే, ధోనీ 2023 ఐపీఎల్ కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాడు.